రైలు ఢీకొని వృద్ధురాలు మృతి | Woman dies in Train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

May 21 2015 5:30 PM | Updated on Sep 3 2017 2:27 AM

రైలు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా భువనగిరిలో గురువారం చోటుచేసుకుంది.

నల్గొండ : రైలు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా భువనగిరిలో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరిలోని అర్బన్‌కాలనీకి చెందిన మారబోయిన ఐలమ్మ(60) కూరగాయల మార్కెట్ నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఉన్న ఎల్‌సీ 30 నెంబర్ రైల్వే గేట్ వేసి ఉండటంతో ఆమె గేట్ కింది నుంచి పట్టాలు దాటడానికి ప్రయత్నించింది. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వెళ్తున్న పాట్నా ఎక్స్‌ప్రెస్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఎస్. కాంతారావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement