ఆటోను ఢీకొట్టిన లారీ..ఇద్దరి మృతి

ఆటోను ఢీకొట్టిన లారీ..ఇద్దరి మృతి - Sakshi


కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.


కరీంనగర్ నగునూరు గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని కరీంనగర్, వరంగల్ ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఒకరిది చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన పానుగంటి లక్ష్మయ్య(35)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top