ఆటో-లారీ ఢీ:ఆరుగురు మృతి | Six passengers killed in road accident | Sakshi
Sakshi News home page

ఆటో-లారీ ఢీ:ఆరుగురు మృతి

Apr 6 2014 10:20 AM | Updated on Nov 6 2018 4:55 PM

తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం గొల్లగూడు పాలెం వద్ద ఆటో-లారీ ఢీ కొన్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం గొల్లగూడు పాలెం వద్ద ఆటో-లారీ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. 

 

రహదారిపై మృతదేహలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకో లేదు. దాంతో పోలీసులు తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement