అస్వస్థతతో గిరిజన విద్యార్థిని మృతి | Tribal student Died with illnes | Sakshi
Sakshi News home page

అస్వస్థతతో గిరిజన విద్యార్థిని మృతి

Nov 19 2015 11:36 AM | Updated on Aug 17 2018 2:53 PM

గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని అస్వస్థతతో మృతి చెందింది.

బెజ్జూరు మండలం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన కొమరం మమ్మీ(13) అనే 8వ తరగతి విద్యార్థిని తీవ్ర అస్వస్థతతో గురువారం మృతి చెందింది. బాలిక రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. బుధవారం వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించింది. బాలిక స్వగ్రామం బెజ్జూరు మండలం కోయపల్లి.

 

Advertisement
 
Advertisement
Advertisement