
ముగిసిన కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలు
కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలు స్వగ్రామం నల్గొండ జిల్లా రసూల్ గూడెంలో అధికార లాంఛనాలతో ముగిశాయి.
హైదరాబాద్: కానిస్టేబుల్ నాగరాజు అంత్యక్రియలు స్వగ్రామం నల్గొండ జిల్లా రసూల్ గూడెంలో అధికార లాంఛనాలతో ముగిశాయి. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలో నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే.
మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బూర నరసయ్య గౌడ్, ఐజీ, డీఐజీలు నాగరాజు భౌతికకాయం వద్ద నివాళులర్పిచారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. నాగరాజుకు నివాళులర్పించారు.