సౌదీ అరేబియాలో పాము కాటుకు తెలుగు వ్యక్తి బలయ్యాడు.
నిజామాబాద్: సౌదీ అరేబియాలో పాము కాటుకు తెలుగు వ్యక్తి బలయ్యాడు. అక్కడి వారికి కేవలం అతని జిల్లా నిజామాబాద్ అని మాత్రమే తెలవడంతో 'సాక్షి' రిపోర్టర్కు ఫొటో పంపించారు. చనిపోయిన వ్యక్తి పేరు కూడా తెలవకపోవడంతో ఫేస్బుక్, వ్యాట్స్ యాప్లలో అతని ఫొటో పోస్టు చేసి బంధువులకు సమాచారం అందించాలని అక్కడి కంపెనీ వారు కోరారు. అధికారులు మృతదేహాన్ని ఇండియా తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.