గల్ఫ్‌లో కరీంనగర్‌వాసి మృతి | Telangana resident dies of heart attack in Gulf | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో కరీంనగర్‌వాసి మృతి

Sep 22 2015 5:09 PM | Updated on Aug 21 2018 3:08 PM

కథలాపూర్ మండలం దొంపేట గ్రామానికి చెందిన నక్కల లక్ష్మయ్య(55) గుండెపోటుతో గల్ఫ్‌లో ప్రాణాలు విడిచాడు.

కరీంనగర్ (కథలాపూర్) : కథలాపూర్ మండలం దొంపేట గ్రామానికి చెందిన నక్కల లక్ష్మయ్య(55) గుండెపోటుతో గల్ఫ్‌లో ప్రాణాలు విడిచాడు. లక్ష్మయ్య ఏడాదిన్నర క్రితం పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో స్టీల్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. గుండెపోటుతో సోమవారం మృతిచెందినట్లు తెలిసింది. కుటుంబసభ్యులకు ఆలస్యంగా మంగళవారం ఈ సమాచారం అందింది. లక్ష్మయ్యకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement