రెండో విడత పంచాయతీ ఎన్నికలలోనూ టీఆర్‌ఎస్‌దే హవా!

Telangana Panchayat Elections Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి మొదలుకాగానే కారు జోరు చూపిస్తోంది. 3 వేల 341 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు దూసుకెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో మొదటి విడతలో మాదిరే కారు స్పీడును కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులతో సహ ఏ పార్టీ అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 733 టీఆర్ఎస్ మద్దతుదారులు, 70 కాంగ్రెస్ మద్దతుదారులు, ఇతరులు 119 స్థానాల్లో గెలుపొందారు. మరో రెండు గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు రానున్నాయి.

జిల్లాలు టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ టీడీపీ బీజేపీ ఇతరులు
ఆదిలాబాద్ 9 11 0 0 51
భద్రాద్రి 21 5 2 0 8
జగిత్యాల 22 3 0 0 7
జనగామ 30 2 0 0 2
జయశంకర్ 14 6 2 0 2
జోగులాంబ 15 1 0 0 3
కామారెడ్డి 70 26 0 0 13
కరీంనగర్ 10 1 0 0 4
ఖమ్మం 58 4 5 0 8
కొమరం భీం 26 5 0 1 3
మహబూబాబాద్ 49 5 0 0 0
మహబూబ్ నగర్ 71 6 0 0 15
మంచిర్యాల 24 4 0 0 3
మెదక్ 61 5 0 0 5
మేడ్చల్ 7 0 0 0 0
నాగర్ కర్నూల్ 19 2 0 0 0
నల్గొండ 51 1 0 0 0
నిర్మల్ 21 4 0 0 0
నిజామాబాద్ 31 2 0 0 1
పెద్దపల్లి 7 1 0 0 1
రాజన్న 16 0 0 0 0
సంగారెడ్డి 49 2 1 0 0
సిద్దిపేట 18 0 0 0 0
సూర్యాపేట 24 0 0 0 5
వికారాబాద్ 12 1 0 0 5
వనపర్తి 17 0 0 0 4
వరంగల్ రూరల్ 31 2 0 0 0
వరంగల్ అర్బన్ 2 0 0 0 0
యాదాద్రి 17 0 0 0 0

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top