
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్డుల విభజన సక్రమంగా చేయకుండా ఎలా ఎన్నికలకు వెళతారని పిటిషనర్ తరపు లాయర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం రోజున వాదనలు కొనసాగనున్నాయి.