ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ | Telangana CM KCR Will Meet PM Modi On Tomorrow | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్‌

Oct 2 2019 1:36 PM | Updated on Oct 2 2019 1:37 PM

Telangana CM KCR Will Meet PM Modi On Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. విభజన హామీల పరిష్కారం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, నిధుల శాతం కూడా పెంచాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అంశాలపై వీరిద్దరు చర్చించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement