విద్యార్థులను చితకబాదిన టీచర్‌ | teacher attacks student | Sakshi
Sakshi News home page

విద్యార్థులను చితకబాదిన టీచర్‌

Jul 29 2017 1:32 AM | Updated on Mar 28 2018 11:26 AM

విద్యార్థులను చితకబాదిన టీచర్‌ - Sakshi

విద్యార్థులను చితకబాదిన టీచర్‌

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెప్పినమాట వినలేదని ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులను చితకబాదింది.

ఆమనగల్లు (కల్వకుర్తి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెప్పినమాట వినలేదని ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులను చితకబాదింది. ఓ విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు ఆమనగల్లు పోలీసులు ఉపాధ్యాయురాలు ఎన్‌.సుజలకుమారి ప్రకాశ్‌ పై కేసు నమోదు చేశారు.

సుజలకుమారి శుక్రవారం 6వ తరగతికి వెళ్లారు. విద్యార్థులు తమ షూలను తరగతి గది బయట విడిచి రావాలని చెపితే లోపలకు ఎందుకు తీసుకువచ్చారంటూ  విద్యార్థినుల తల, చేతులపై కట్టెతో కొట్టింది. దీంతో విద్యార్థుల చేతులు కంది పోయి ఎర్రగా మారాయి. ఇందులో 15 మంది విద్యార్థులు అన్నం తినడానికి సైతం ఇబ్బంది పడ్డారు. విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి  తమ పిల్లలను ఇలా కొట్టి చంపుతారా? అంటూ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దెబ్బలు తగిలిన విద్యార్థినులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement