మెదక్‌లో ఉద్రిక్తత; విద్యార్థిని మృతదేహంతో నిరసన

Student Family Making Protest On Gurukul School In Medak - Sakshi

సాక్షి, మెదక్‌ : మెదక్‌ పట్టణంలోని గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ నేపథ్యంలో కావ్య కుటుంబసభ్యులు మృతదేహంతో పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డుపై బైటాయించి తమ నిరసన తెలిపారు. దీంతో ఈ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. గత నెల రోజులుగా కావ్య డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్నరెసిడెన్షియల్‌​ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని పేర్కొన్నారు. దీనికి పాఠశాల ప్రిన్సిపాల్‌ భాద్యత వహించాలని, ఆమె నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top