సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడి పదవులను వేలం వేస్తున్న ఘటనల పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) తీవ్రంగా స్పందించింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 211(1) ప్రకారం ఎన్నికల్లో సర్పంచ్, వార్డు పదవులను వేలం వేయడం అక్రమమని స్పష్టంచేసింది. ఐపీసీలో ఎన్నికల అక్రమాలకు సంబంధించిన సెక్షన్లు 171(బీ), 171(ఈ) ప్రకారం శిక్షార్హమని హెచ్చరించింది. నేరారోపణలు రుజువైతే ఏడాది జైలు శిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఎన్నికల ట్రిబ్యునల్లో ఆరోపణలు రుజువైతే పదవులకు ఎన్నికైన ప్రతినిధులపై అనర్హత వేటు పడుతుందని తెలిపింది. లంచాల పంపిణీ, అనైతికంగా ప్రభావితం చేసి ఏకగ్రీవ ఎన్నికలు నిర్వహిస్తే సదరు ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేసి ఆయా గ్రామ పంచాయతీల్లో మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేసింది.
వేలంతో నిరంకుశత్వం..
రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా, పలు ప్రాంతాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసేందుకు డబ్బులు వసూలు/డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. పదవుల వేలంలో పాల్గొన్న వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పదవులకు వేలం నిర్వహిస్తే తమకు నచ్చిన అభ్యర్థులకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును ఓటర్లు కోల్పోతారని అభిప్రాయపడ్డారు. ప్రజలందరిపై కొద్దిమంది నిరంకుశత్వం చెలాయించడానికి అవకాశమిచ్చినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవుల వేలానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పత్రికలు, న్యూస్ చానళ్లలో వచ్చే వార్తలపై దర్యాప్తు జరిపేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
పదవుల వేలంలో పాల్గొనే వ్యక్తులపై సరైన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టి దర్యాప్తు జరపాలన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినట్లు వచ్చే సమాచారం ఆధారంగా విచారణ జరిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్తోపాటు సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని సూచించారు. సాధారణ పరిశీలకుడి నుంచి అనుమతి పొందిన తర్వాతే ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించాలని కోరారు. ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన చోట్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్వీయ సంతృప్తి పొందిన తర్వాతే సాధారణ పరిశీలకులు ఫలితాల ప్రకటనకు అనుమతించాలన్నారు.
Published Wed, Jan 9 2019 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement