రూ. 25 లక్షల కందిపప్పు స్వాధీనం | RRDistrict Commercial tax official rides on mills at Gagan Pahad | Sakshi
Sakshi News home page

రూ. 25 లక్షల కందిపప్పు స్వాధీనం

Jan 25 2015 12:16 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో గగన్‌పహాడ్‌లో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమ కందిపప్పు నిల్వలు వెలుగు చూశాయి.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్పహాడ్లోని పలు పప్పు ధాన్యం మిల్లులపై వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆదివారం అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా భారీగా కందిపప్పు అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కందిపప్పును స్వాధీనం చేసుకుని... రెండు లారీలను సీజ్ చేశారు. అలాగే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కందిపప్పు విలువ రూ. 25 లక్షలు ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement