రైతు భరోసాకు రాహుల్ వచ్చాడు | rahul gandhi enterd in to adilabad | Sakshi
Sakshi News home page

రైతు భరోసాకు రాహుల్ వచ్చాడు

May 14 2015 9:15 PM | Updated on Jun 4 2019 5:04 PM

రైతు భరోసాకు రాహుల్ వచ్చాడు - Sakshi

రైతు భరోసాకు రాహుల్ వచ్చాడు

ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో రాత్రి నాందేడ్ చేరుకున్నారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో రాత్రి నాందేడ్ చేరుకున్నారు. అనంతరం భైంసాకు వెళ్లారు. అక్కడ నుంచి ఆయన కారులో నిర్మల్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్మల్కు చేరుకున్నాయి. రాహుల్ నిర్మల్(ఆదిలాబాద్ జిల్లా)కు చేరుకుని రాత్రికి హోటల్ మయూరా ఇన్‌లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కొరటికల్ గ్రామం నుంచి రాహుల్ పాదయాత్ర మొదలవుతుంది. లక్ష్మణచాందా, పోటుపల్లి, రాచాపూర్ మీదుగా వడ్యాల దాకా 15 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేసి రైతులను పరామర్శిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement