తల్లి మీద ప్రేమతో.. ఆ యువకుడు | one person suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

తల్లి మీద ప్రేమతో.. ఆ యువకుడు

Jun 21 2017 7:26 PM | Updated on Nov 6 2018 8:08 PM

తల్లి మీద ప్రేమతో.. ఆ యువకుడు - Sakshi

తల్లి మీద ప్రేమతో.. ఆ యువకుడు

తల్లి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతోంది.

హైదరాబాద్‌: తల్లి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పడుతున్నభాదను తట్టుకోలేకపోయాడు.. తల్లి బతకదేమో.. ఆమె లేని జీవితం ఎందుకని మనో వేదనకు గురైన ఓ కుమారుడు రైలు కిందపడి తనువు చాలించాడు. ఈ విషాద ఘటన కాచిగూడ రైల్వేస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. రాంనగర్‌ ప్రాంతానికి చెందిన లక్ష్మినారాయణ కుమారుడు పి. వవన్‌ వైభవ్‌(21) చిన్నతనం నుంచి తల్లిపై ప్రేమను పెంచుకున్నాడు.

ఇటీవల తల్లి అగ్ని ప్రమాదానికి గురై యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తల్లి ఇక బతకదేమోనని, తల్లిలేని జీవితం తనకెందుకని మానసిక వేదనకు గురై కాచిగూడ-విద్యానగర్‌ రైల్వ స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌. నిరంజన్‌ నాయక్‌ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement