ఏసీబీ నుంచి తప్పించుకున్న ఆర్ఐ | Mandhani RI escaped from ACB in Karimnagar district | Sakshi
Sakshi News home page

ఏసీబీ నుంచి తప్పించుకున్న ఆర్ఐ

May 4 2016 1:32 PM | Updated on Aug 17 2018 12:56 PM

కరీంనగర్ జిల్లా మంథని ఆర్డీవో కార్యాలయ ఉద్యోగి తృటిలో ఏసీబీ అధికారుల వల నుంచి తప్పించుకుని పరారయ్యాడు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా మంథని ఆర్డీవో కార్యాలయ ఉద్యోగి తృటిలో ఏసీబీ అధికారుల వల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్.కోటేశ్వరరావు బుధవారం ఓ రైతు నుంచి రూ.50వేలు లంచం తీసుకున్నాడు. బాధితుడి సమాచారంతో ముందస్తు పథకం ప్రకారం అధికారులు వచ్చి సీనియర్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకునేలోపే అతడికి విషయం తెలుసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement