మద్యం తాగించి హత్య చేశారు | Man murdered in nalgonda district | Sakshi
Sakshi News home page

మద్యం తాగించి హత్య చేశారు

Feb 24 2016 3:39 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేసిన సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

నల్లగొండ : ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేసిన సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. బంద్రు వేంకటేశ్ (24) అనే యువకుడిని కొంత మంది వ్యక్తులు బాగా మందు తాగించి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత మృతదేహన్ని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడేశారు.

ఈ విషయాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి... రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ తరలించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడి తల్లిదండ్రులు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement