రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
ఘట్కేసర్ (హైదరాబాద్) : రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం పరిధిలోని కొండాపూర్ రైల్వే గేట్ వద్ద ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరిగింది. మృతుడి వయసు సుమారు 32 ఏళ్లు ఉంటుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామాకు తరలించారు.