‘మెట్రో గ్రౌండ్‌లో సభ పెట్టుకోండి.. మాకొద్దు’ | high court given permission to tjac meet in nagole metro grounds | Sakshi
Sakshi News home page

‘మెట్రో గ్రౌండ్‌లో సభ పెట్టుకోండి.. మాకొద్దు’

Feb 21 2017 4:21 PM | Updated on Apr 7 2019 3:47 PM

‘మెట్రో గ్రౌండ్‌లో సభ పెట్టుకోండి.. మాకొద్దు’ - Sakshi

‘మెట్రో గ్రౌండ్‌లో సభ పెట్టుకోండి.. మాకొద్దు’

నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది. నాగోల్‌లోని మెట్రో గ్రౌండ్‌లో తెలంగాణ జేఏసీ నిరుద్యోగుల నిరసన సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్‌: నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది. నాగోల్‌లోని మెట్రో గ్రౌండ్‌లో తెలంగాణ జేఏసీ నిరుద్యోగుల నిరసన సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే, తాము నిరుద్యోగుల నిరసన సభ నిర్వహించేదే మొత్తం తెలంగాణ సమాజానికి తెలియాలని, అందుకే హైదరాబాద్‌ నడిబొడ్డున సభ నిర్వహించాలనుకుంటే తమకు శివారు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ జేఏసీ తమ పిటిషన్‌ను వెనక్కి ఉపసంహకరించుకుంది.

తాము మాత్రం నాగోల్‌ మెట్రో గ్రౌండ్‌లో సభను నిర్వహించబోమని టీ జేఏసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై మరికాసేపట్లో వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ సభ నిర్వహణ కోసం హైకోర్టులో జరిగిన వాదోపవాదాలను టీజేఏసీ తరుపు న్యాయవాదులు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని అన్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement