అడవికి రక్షణ | Forest protection and Wildlife preserves | Sakshi
Sakshi News home page

అడవికి రక్షణ

Feb 15 2015 1:25 AM | Updated on Oct 3 2018 5:26 PM

అడవికి రక్షణ - Sakshi

అడవికి రక్షణ

అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, 33 శాతం అడవు ల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు...

ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు
కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ
మెంబర్ కన్వీనర్‌గా డీఎఫ్‌ఓ
డీఐజీ, సీఎఫ్‌లు ప్రత్యేక ఆహ్వానితులు
జేసీ, ఎస్‌పీ సహా 9 మంది సభ్యులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
33 శాతం అడవుల అభివృద్ధి లక్ష్యం
వన్యప్రాణులకూ తగిన భద్రత

 
అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించాలన్న ప్రతిపాదనలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అధికారులు చేసిన సిఫారసులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల గురించి పలుమార్లు చర్చించిన ఉన్నతస్థాయి అధికారులు సర్కారుకు నివేదికను సమర్పించారు. దాని ఆధారంగానే పునర్వ్యవస్థీకరణ ఫైలుకు ఆమోదం లభించింది.
 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, 33 శాతం అడవు ల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ చైర్మన్‌గా మ రో తొమ్మిది మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేస్తుంది.

డాక్టర్ నర్పట్‌సింగ్ నివేదికకు మోక్షం

మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి, అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్ డాక్టర్ నర్పట్‌సింగ్ ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి సమర్పించిన నివేదికలో, సమూల మార్పులు చేయాలని సూచించారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పెంపకం, అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు మార్గదర్శనం చేశారు. జిల్లాలో ఇకపై ఐఎఫ్‌ఎస్ క్యాడర్ కలిగిన అధికారులనే ఫారెస్టు కన్జర్వేటర్, డిప్యూటీ కన్జర్వేటర్, డిఎఫ్‌ఓలుగా నియమించాలని సూచించారు. అటవీ శాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం జరగనున్న నేపథ్యంలో డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అటవీ పరిధి తగ్గించాలన్నారు.

ప్రస్తుతం ఒక్కో డివిజన్‌లో 1473 చద రపు కిలోమీటర్లు కాగా, 750 చదరపు కిలోమీటర్లకు తగ్గిం చాలి. అదేవిధంగా ఒక్కో డివిజన్‌లో మూడు నుంచి నాలు గు రేంజ్‌లు, సెక్షన్ పెరుగుతుండటంతో బీట్ ఆఫీసర్ల పరిధి 25 చదరపు కిలో మీటర్ల నుంచి 15 చదరపు కిలోమీటర్లకు కుదించాలి. నిజామాబాద్ అటవీ సర్కిల్ పరి ధిలో నిజామాబాద్, మెదక్ డివిజన్లు ఉండగా, ఈ రెండింటిని త్వరలోనే విడదీసి రెండు సర్కిళ్లు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలోని రెండు డివిజన్లు నాలుగుకు పెరగనున్నా యి. ఇదే క్రమంలో మొదటగా తెలంగాణ ప్రభుత్వం జిల్లాస్థాయి కమిటీలను వేయడంతో నర్పట్‌సింగ్ ప్ర తిపాదనలకు కదలిక వచ్చినట్లుగా భావిస్తున్నారు.

దశలవారీగా అమలు

అటవీ శాఖ పటిష్టత, పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాలను దశలవారీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తు న్న ప్రభుత్వం మొదటగా జిల్లా స్థాయిలో కమిటీలను వేసింది. కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని రూపొం    దిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేశ్వర్ తివారి జీఓ నంబర్ 33 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో జిల్లా కేంద్రంలో ఉండే డివి జనల్ ఫారెస్టు అధికారి మెంబర్ కన్వీనర్‌గా, కన్సర్వేటర్, పోలీసుశాఖ డీఐజీలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. జాయింట్ కలెక్టర్,ఎస్‌పీ , డివిజన్ ఫారె స్టు అధికారులు (టెరిటోరియల్), ఐటీడీఏ పీఓ/గిరిజన సంక్షేమశాఖాధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ నామినేట్ చేసే ఇద్దరు నాన్-ఆఫీషియల్స్  సభ్యులుగా ఉంటారు.

జిల్లాస్థాయిలో పనిచేసే ఈ అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ తరచూ అడవులలో తనిఖీలు నిర్వహిస్తుంది. అక్రమ కలప రవాణాను అడ్డుకునేందుకు దాడులను కొనసాగిస్తుంది. అటవీ, పోలీసు, రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖలను సమన్వయం చేస్తూ అడవులను అభివృద్ది చేసేందు    కు ప్రభుత్వ కార్యచరణను అమలు చేస్తుంది. ‘హరి తహారం’ తదితర పథకాల ద్వారా జిల్లాలో 25 శా తం నుంచి 33 శాతం అడవులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement