పెళ్లి భోజనం వికటించి 50 మందికి అస్వస్థత | food poisoning before wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి భోజనం వికటించి 50 మందికి అస్వస్థత

Apr 28 2015 3:43 PM | Updated on Sep 3 2017 1:02 AM

పెళ్లి భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్లర్లు తెలిపారు.

పెళ్లి భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్లర్లు తెలిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం తాంగిడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాంగిడి గ్రామానికి చెందిన సందీప్‌కు, సాగ్టీ గ్రామానికి చెందిన మంజుషాతో మంగళవారం వివాహం జరగనుంది.

కాగా సంప్రదాయంలో భాగంగా పెళ్లికి ముందు రోజు పెళ్లికూతురి ఇంట్లో బోనాలు ఏర్పాటు చేశారు. బోనాల కోసం నిన్న వండిన వంటలను ఈరోజు ఉదయం ఆరగించడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి పెళ్లికి వచ్చిన బంధువులంతా అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ప్రస్తుతం 18 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement