మద్యం మత్తులో కన్నతండ్రితో గొడవపడిన తనయుడు తండ్రి చేతిలోనే హతమయ్యాడు.
మెదక్ : మద్యం మత్తులో కన్నతండ్రితో గొడవపడిన తనయుడు తండ్రి చేతిలోనే హతమయ్యాడు. ఈ సంఘటన మెదక్ రూరల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఔరంగాబాద్ గ్రామానికి చెందిన బీమరి కిషన్, లక్ష్మి దంపతుల చిన్న కుమారుడు బీమరి రాజు(30) తరచూ తాగివచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడు. రాజు భార్య జ్యోతి ఇటీవలే తల్లిగారింటికి వెళ్లింది. కాగా రాజు ఆదివారం రాత్రి తాగివచ్చి తన తండ్రి కిషన్తో గొడువకు దిగాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెరిగింది. దీంతో కిషన్ ఆవేశంలో కర్రతో తన కొడుకు రాజు తలపై కొట్టడంతో తీవ్ర గాయమై రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.