అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicide in nalgonda distirict | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Sep 28 2015 11:13 AM | Updated on Nov 6 2018 7:56 PM

సాగు భారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నల్లగొండ జిల్లాలో ఒక రైతు ప్రాణాలు తీసుకున్నాడు.

చివ్వెంల: సాగు భారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నల్లగొండ జిల్లాలో ఒక రైతు ప్రాణాలు తీసుకున్నాడు. చివ్వెంల మండలం లక్ష్మా తండా శివారు జాలుతండాకు చెందిన ధరావత్ శంకర్(40)కు మూడెకరాల భూమి ఉంది. దానిలో పత్తి, వరి సాగు చేశాడు. ఈ ఏడాది పత్తి ఆశాజనకంగా లేదు. గత ఏడాది మూడెకరాలు కౌలుకు తీసుకుని, సాగు చేయగా రూ.లక్ష అప్పు అయింది. కూతురి పెళ్లికోసం మరో రెండు లక్షల మేర అప్పు చేశాడు. అప్పులు బాధతో తీవ్ర మనస్థాపానికి గురైన శంకర్ సోమవారం ఉదయం చేనులోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement