మిర్యాలగూడలో విస్తృతంగా ఎక్సైజ్ దాడులు | Excise Officials Raids in Miryalaguda | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో విస్తృతంగా ఎక్సైజ్ దాడులు

Jul 2 2015 1:41 PM | Updated on Sep 5 2018 8:43 PM

ఎక్సైజ్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు సంయుక్తంగా మిర్యాలగూడ మండలంలో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి నాటుసారాను ధ్వంసం చేశారు.

మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) : ఎక్సైజ్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు సంయుక్తంగా మిర్యాలగూడ మండలంలో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి నాటుసారాను ధ్వంసం చేశారు. మిర్యాలగూడ మండలం రాజీవ్‌నగర్ కాలనీ, జాన్‌బావితాండా, గెడ్డగూడుతాండా తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 28 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 40 లీటర్ల నాటుసారా, 10 కేజీల పటిక బెల్లంను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే మిర్యాలగూడ టూటౌన్ పరిధిలో 6వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఏడుకొండలు, ఎస్‌ఐ సంజీవరెడ్డి, రూరల్ ఎస్‌ఐ సర్దార్ నాయక్, మిర్యాలగూడ టూటౌన్ సీఐ పాండురంగారెడ్డి, ఎస్‌ఐ శీనయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement