విద్యుదాఘాతంతో తండ్రీ కొడుకులు మరణం | electric shock kills father and sun in khammam district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో తండ్రీ కొడుకులు మరణం

Nov 15 2015 7:54 AM | Updated on Apr 3 2019 8:07 PM

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో తండ్రి కోడుకులు మృతి చెందారు.

ఇల్లందు(ఖమ్మం): ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో తండ్రీ కోడుకులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందులోని గోవింద్ సెంటర్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సత్యనారాయణ(40) చికెన్ సెంటర్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఆదివారం కావడంతో.. తనతో పాటు కొడుకు సందీప్(18)ను తోడు తీసుకెళ్లాడు. దుకాణంలో ఉన్న బాయిలర్ ఆన్ చేయడానికి వెళ్లిన సందీప్‌కు షాక్ కొట్టడంతో అతన్ని రక్షించేందుకు వెళ్లిన సత్యనారాయణ కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు.

ఒకే కుంటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో.. ఇల్లందులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement