రైతులతో త్వరలో సీఎం కేసీఆర్‌ సమావేశం | CM KCR meeting with three thousand farmers soon | Sakshi
Sakshi News home page

రైతులతో త్వరలో సీఎం కేసీఆర్‌ సమావేశం

Jul 11 2017 2:23 AM | Updated on Jun 4 2019 5:04 PM

రైతులతో త్వరలో సీఎం కేసీఆర్‌ సమావేశం - Sakshi

రైతులతో త్వరలో సీఎం కేసీఆర్‌ సమావేశం

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ లక్ష్యాలు, ఉద్దేశాలను రైతులకు వివరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ లక్ష్యాలు, ఉద్దేశాలను రైతులకు వివరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. త్వరలో జిల్లాకు వంద మంది రైతుల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది రైతులతో సీఎం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఆ శాఖ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లా నుంచి ఆదర్శవంతమైన, వివాదరహితులైన రైతులను గుర్తించి, రెండు రోజుల్లో ఆ వివరాలను కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశించారు. సమగ్ర సర్వే 85 శాతం పూర్తయిందని, ఇంకెక్కడైనా రైతులుంటే వారినీ నమోదు చేయాలన్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లాల సమగ్ర సర్వే నివేదికలు తమకు పంపాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement