- తెలంగాణకు 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని నిధులిచ్చాం: అమిత్షా
- ఏపీలో ఇప్పటికయితే టీడీపీతో దోస్తీ ఉందని వ్యాఖ్య
నల్లగొండ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తెలంగాణకు వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర నిధులిచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఇన్ని నిధులు గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదన్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.9,550 కోట్లు రాగా.. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.96,706 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గతంలో కంటే స్థానిక సంస్థలకు 30 రెట్లు ఎక్కువగా.. అంటే రూ.8,764 కోట్లు వచ్చాయని తెలిపారు. వీటితోపాటు ఎయిమ్స్ పలు యూనివర్సి టీలు, మౌలిక వసతులకు రూ.40,800 కోట్లు ఇచ్చినట్లు వివరించారు.
రహదారుల నిర్మాణానికి గతంలో కనీవినీ ఎరుగని విధంగా నిధులు మంజూరు చేశామని, 2016–17లో పేదల కోసం రాష్ట్రంలో 90 వేల ఇళ్లను కేటాయించామని తెలిపారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్ మా రాజకీయ ప్రత్యర్థే.. 2019లో సొంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. తెలంగాణలో మోదీ ప్రభుత్వంపై ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు, ఆదరణ ద్వారా అధికారంలోకి రాగలమని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. కేంద్రం తెచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో విఫలమైందని విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లను పెంచడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
మూడేళ్లు అవినీతి రహిత పాలన
‘‘పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల మేర అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ హయాంలో విధానాలు పక్షవాతం (పాలసీ పెరాలసిస్) బారిన పడ్డాయి. అందుకు భిన్నంగా మూడేళ్లలో అవినీతిరహిత ప్రభుత్వాన్ని నడిపించి చూపించాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. భారత్ వేగంగా ఎదుగుతున్న ఆర్థికశక్తిగా మారిందని, జీడీపీ పెరుగుదల, ధరల నియంత్రణతో పాటు ఎఫ్డీఐలు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని 60 శాతం భూభాగంలో బీజేపీ విస్తరించిందని, సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు.
ఎన్నికలకు ఒంటరిగానే..
2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో ఇప్పటికయితే రాజకీయ పొత్తు ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించగా.. దీనిపై ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వ్యూహాన్ని అంత సులభంగా ఎలా బయటపెడతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
లక్ష కోట్లపైనే ఇచ్చాం
Published Wed, May 24 2017 2:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement