breaking news
-
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధిపై దృష్టి సారిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.కేంద్రమంత్రివర్గంలోకి తెలంగాణ బీజేపీ నుంచి ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అవకాశం లభించింది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండిసంజయ్లు ఉన్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి వారికి సమాచారం వచ్చింది.ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కేంద్రంలో సహాయ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. మంత్రిగా ఒక రోడ్డు మ్యాప్ తయారు చేసుకొని పనిచేస్తా. కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయి అనే దానికి ఇదే సంకేతం.వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రంగా పనిచేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి.. మోదీకి కృతజ్ఞతలు
తెలంగాణకు ఒక క్యాబినెట్, ఒక సహాయమంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మోదీ కేబినెట్లో కేంద్రమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో నిఖార్సైన కార్యకర్తకు మంత్రి పదవి ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాలలో (ఏపీ నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ముగ్గురు) బీజేపీ కార్యకర్తలకు మంత్రి పదవి దక్కడం బీజేపీ సిద్ధాంత బలానికి నిదర్శనమని అన్నారు.వారసత్వ రాజకీయ బలం లేకున్నా సిద్ధాంతాన్ని నమ్ముకొని నిలబడ్డామన్న కిషన్ రెడ్డి..తెలంగాణలో స్వతంత్రంగా 8 స్థానాలు సాధించామన్నారు. 36 శాతం ఓట్లతో బీజేపీలో కొత్త చరిత్ర సృష్టించాం. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 88 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరూ కష్టపడి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. మోదీ సారధ్యంలో రాబోయే రోజుల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మమరోవైపు తొలిసారి కేంద్రమంత్రి వర్గంలో అడుగుపెట్టిన ఏపీ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా బీజేపీలో పని చేస్తున్నాను.ప్రతి కార్యకర్త నా విజయం కోసం పనిచేశారు.కష్టపడి పనిచేసే కార్యకర్తకు తప్పనిసరిగా అవకాశం వస్తుందనే దానికి నేను నిదర్శనం. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని వెల్లడించారు. -
కేంద్రమంత్రిగా బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో తెలంగాణా నుంచి ఇద్దరికి చోటు దక్కింది. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కు అవకాశం దక్కింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కీలకంగా వ్యవహరించిన బండి సంజయ్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సంజయ్కు కేంద్ర మంత్రి పదవి.. కరీంనగర్లో సంబరాలుబండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి వరించడంతో కరీంనగర్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సంజయ్ ఇంటివద్ద, ఎంపీ కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. సంజయ్ తల్లి శకుంతల సాక్షి టీవీతో మాట్లాడుతూ, సంజయ్ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం తల్లిగా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సంజయ్ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉందని.. ఇది మాపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన భార్య అపర్ణ సంతోషం వ్యక్తం చేశారు.బండి సంజయ్ వ్యక్తిగత ప్రొఫైల్పుట్టిన తేదీ:11-7-1971తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) - శకుంతల.అక్క :శైలజ అన్నలు : బండి శ్రవణ్ కుమార్ బండి సంపత్ కుమార్భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్కులం: మున్నూరుకాపు,(బి.సి-'డి')ప్రస్తుత బాధ్యతలు:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగతంలో చేపట్టిన బాధ్యతలు:బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్గా..బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్గా భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. BJP రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జ్గా, కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు.వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షునిగా2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.2019లో ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్గా నియామకం2019లో అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్గా నియామకం2019లో టొబాకో బోర్డు మెంబర్గా నియామకం.2019లో మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్గా నియామకం2020లో ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబర్గా నియామకం2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం2023లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89000 ఓట్లు సాధించారు2024లో జాతీయ కిసాన్ మోర్చా ఇంఛార్జ్గా నియామకం2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2 లక్షల 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపు -
కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మొదటి దశలో గ్రేటర్ నుంచి మంత్రి పదవి దక్కేదెవరికి? అన్నది హాట్ టాపిక్గా మారింది. ఆదివారం ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో నగరం నుంచి మోదీతో పాటు ప్రమాణం చేసే అదృష్టవంతుడెవరన్నది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. రాజధాని నగరమైన హైదరాబాద్ పరిసరాల నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయంగా తెలుస్తోంది. అయితే.. అది ఎవరిని వరించనుందన్నదే ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలుగా గెలుపొందడం తెలిసిందే. వీరిలో కిషన్రెడ్డి రెండో పర్యాయం గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కిషన్రెడ్డికే కేంద్ర మంత్రివర్గంలో తొలి దశలోనే అవకాశం లభించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కిషన్రెడ్డికి ఈసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి లభించనుందనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. అయినప్పటికీ.. తొలుత మంత్రి పదవి అయితే ఇస్తారని, అంతే కాకుండా అధ్యక్ష పదవి కంటే మంత్రిగానే ఆయనకు ప్రాధాన్యమిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ జట్టులో ఆయనతో పాటు ప్రమాణం చేసే మంత్రుల జాబితాలో కిషన్రెడ్డి పేరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టేట్ బాస్గా ఈటల? దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం, ప్రస్తుతం సీఎంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానంలో గెలిచిన ఈటల రాజేందర్కు తగిన గుర్తింపునిచ్చేందుకు మంత్రిపదవి ఇస్తారనే అభిప్రాయాలున్నా, తొలిదశలో కిషన్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, ఈటలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించలరన్న అభిప్రాయాలు ఉన్నాయి. కిషన్రెడ్డి కంటే ముందు పార్టీ రాష్ట్ర చీఫ్గా ఉన్న బండి సంజయ్ బీసీ కావడంతో త్వరలో నియమించే కొత్త అధ్యక్ష పదవి కూడా బీసీలకే ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఈటలకు ఆ అవకాశం కలి్పస్తారని చెబుతున్నారు. ఏ పారీ్టలో ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటనలు, కేడర్ను కలుపుకుపోవడం, సమన్వయం చేయడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించే అవకాశాలు ఎక్కువని రాజకీయ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. -
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు. -
మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్ అనంతరం మల్లన్న గెలుపొందినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు (1,55,095) రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది.మొదటి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి« తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 29,697 ఓట్లు లభించాయి. అయినా గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. 48 మందిని ఎలిమినేట్ చేయగా.. ఈ ఎన్నికలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో తక్కువ ఓట్లు వచ్చిన 48 మంది ని ఎలిమినేట్ చేసి, వారికి పడిన మొదటి ప్రాధాన్య ఓట్లలోని రెండో ప్రాధాన్యతను లెక్కించగా వచ్చిన ఓట్లను కలుపుకోగా కాంగ్రెస్ అభ్యర్థి 1,24,899 ఓట్లకు, బీఆర్ఎస్ అభ్యర్థి 1,05,524 ఓట్లకు, బీజేపీ అభ్యర్థి 43,956 ఓట్లకు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 30,461 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు.49వ రౌండ్లో అశోక్ ఎలిమినేషన్ గెలుపునకు అవసరమైన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో 49వ రౌండ్లో స్వతంత్ర అభ్యర్థి అశోక్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలోని రెండో ప్రా«ధాన్య ఓట్లను లెక్కించారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థికి 10,383 ఓట్లు రావడంతో ఆయన 1,36, 246 ఓట్లకు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి 10,118 ఓట్లు రావడంతో ఆయన 1,16,292 ఓటకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి 4,918 ఓట్లు రాగా ఆయన 48,874 ఓట్లకు చేరుకున్నారు. 50వ రౌండ్లో ప్రేమేందర్రెడ్డి ఎలిమినేషన్ గెలుపునకు అవసరమైన ఓట్లు అప్పటివరకు ఎవరికీ రాకపోవడంతో 50వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన 48,874 ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అందులో తీన్మార్ మల్లన్నకు 14,278 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 19,510 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం 1,50, 524 ఓట్లకు చేరుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు 1,35,802 చేరుకున్నారు.అయినప్పటికీ గెలుపు కోటాకు 4,571 ఓట్లు తక్కువగానే ఉన్నాయి. మల్లన్నకు రాకేశ్రెడ్డి కంటే 14,722 ఓట్లు అధికంగా (మెజారిటీ) ఉన్నాయి. దీంతో రాకేశ్రెడ్డిని ఎలిమినేట్ చేయకుండానే, మల్లన్నకు అధిక ఓట్లు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆమోదంతో మల్లన్న గెలిచినట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలో 10 వేల మంది గ్రాడ్యుయేట్లు ప్రేమేందర్రెడ్డికి తొలి ప్రాధాన్యతను ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వ లేదు. మరో 5 వేలమంది గ్రాడ్యుయేట్లు అశోక్కు తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వలేదు. -
కర్ణాటక ఫార్ములా..?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ పగ్గాల కోసం రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ పట్ల విధేయత, సీనియారిటీతోపాటు విపక్షాలను దీటుగా ఎదుర్కోగలిగిన సామర్థ్యం, అధికారంలో ఉన్న పార్టీని సమన్వయంతో నడి పించగలిగిన నేత కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే అంశాన్ని కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్గానే పరిశీలిస్తున్నట్టు సమాచా రం. అన్ని కోణాల్లో కసరత్తు పూర్తిచేసి ఈ నెలాఖరు కల్లా టీపీసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. విధేయత, సమర్థతను పరిశీలిస్తూ: సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఈనెల 27 నాటికి మూడేళ్లు పూర్తవుతోంది. పీసీసీ అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. దీనికితోడు రేవంత్ సీఎం అయిన నేపథ్యంలో.. పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందుకోసం సామాజిక వర్గాలు, విధేయత, సీనియారిటీ, కర్ణాటక ఫార్ములా తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. సమర్థుడైన నేతను పీసీసీ చీఫ్గా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది.ముఖ్యంగా సీనియారిటీతోపాటు పార్టీ పట్ల విధేయతను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే మూడేళ్లపాటు ప్రభుత్వంతో, పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, విపక్షాలకు దీటుగా కౌంటర్లు ఇవ్వగలిగిన నేతను ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ కోణంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.గతంలో పార్టీని నడిపించిన అనుభవం, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సభ్యుడిగా పనిచేయడం నేపథ్యంలో.. ఉత్తమ్ను మరోమారు పీసీసీ చీఫ్గా నియమించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు. మరోవైపు పారీ్టకి విధేయులైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డితోపాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సామాజికవర్గ కోణంలోనూ ఫోకస్.. పీసీసీ అధ్యక్ష పదవిని సామాజిక వర్గాల కోణంలో ఇవ్వాల్సి వస్తే.. ఎస్సీ (మాదిగ) వర్గ నేతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. ఈ సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎస్సీలకు కాదంటే బీసీలకు పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీహెచ్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నాయి.అదే ఎస్టీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే.. సీతక్క, బలరాం నాయక్ తదితరుల పేర్లను.. మైనార్టీ కోణంలో చూస్తే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. అయితే సామాజిక వర్గాల కోణంలో ఇవ్వాల్సి వస్తే.. ఎస్సీ లేదా బీసీలకే చాన్స్ ఎక్కువనే చర్చ జరుగుతోంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి పీసీసీ బాధ్యతలు ఇవ్వాలనుకుంటే మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆయనను పీసీసీ చీఫ్గా నియమించలేని పక్షంలో ఏఐసీసీలో మంచి హోదాలో నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.మొత్తంగా సీనియారిటీ, సిన్సియారిటీ, సామాజిక వర్గాల లెక్కల్లో అన్ని అంశాలను పరిశీలించి.. ఈ నెలాఖరు కల్లా పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి సోనియాగాం«దీని కలిసిన సందర్భంగా కొత్త పీసీసీ చీఫ్గా ఎవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. కర్ణాటక తరహా ఫార్ములాపై పరిశీలన కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ విషయంలో కర్ణాటక తరహా ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టిన శివకుమార్కు ఆ అవకాశం ఇవ్వలేకపోవడంతో డిప్యూటీ సీఎంతోపాటు పీసీసీ చీఫ్ బాధ్యతలనూ అప్పగించారు. దాంతో ఆయన పారీ్టలో, ప్రభుత్వంలో రెండో పవర్ సెంటర్గా నిలిచారు.అదే తరహాలో తెలంగాణలో డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్కను పీసీసీ చీఫ్గా నియమించే అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రాష్ట్రంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని.. కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఇలానే ఉంటాయని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం గమనార్హం. -
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు. -
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
తెలంగాణలో సరైన ఫలితాలు రాలేదు: ఖర్గే అసంతృప్తి
సాక్షి,ఢిల్లీ: పార్టీ పవర్లో ఉన్న హిమాచల్ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం(జూన్8) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.‘అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మంచి ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు రాణించలేదు. ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. అర్జెంటుగా వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఇండియా కూటమి భవిష్యత్తులో కొనసాగాలి. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలి. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకం నిలబెట్టుకోవాలి. నిరంకుషత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారు. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరిగాయి’అని ఖర్గే అన్నారు. -
కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరించేనో!!
సాక్షి, హైదరాబాద్: త్వరలో కొలువుదీరనున్న కేంద్ర మంత్రివర్గంలో గ్రేటర్ ఎంపీల్లో ఎవరికి చోటు దక్కుతుందోనని అటు బీజేపీ నేతల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అనే అభిప్రాయాలున్నాయి. గెలిచిన నేతల అభిమానులు మాత్రం ఇద్దరికి మంత్రి పదవులిచి్చనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు. పదవి ఖాయమే.. కానీ.. నగరానికి చెందిన బండారు దత్తాత్రేయకు వాజపేయీ, మోదీ హయాంల్లోనూ మంత్రి పదవులు లభించాయి. కేంద్ర సహాయమంత్రి, కేబినెట్ మంత్రి పదవుల్ని ఆయన నిర్వర్తించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ నుంచి రెండో పర్యాయం ఎంపీగా గెలిచిన కిషన్రెడ్డికి సైతం గత మోదీ ప్రభుత్వ హయాంలో తొలుత సహాయ, తర్వాత కేబినెట్ మంత్రి పదవులు వరించాయి. దత్తాత్రేయ కీలకమైన పట్టణాభివృద్ధిశాఖ, కారి్మకశాఖల మంత్రిగానూ పనిచేశారు. కిషన్రెడ్డి తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారీ రాజధాని పరిధిలోని వారికి మంత్రి పదవి ఖాయంగా లభించనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని ఆ పదవి వరించనుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఓసీకైతే కిషన్రెడ్డి.. బీసీకైతే ఈటల.. కిషన్రెడ్డికే మరోసారి మంత్రిగా అవకాశం కలి్పస్తారని భావిస్తున్న వారితోపాటు మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్కు అవకాశం లభించవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ సమయం నుంచీ రాజకీయాల్లో ఆయన క్రియాశీలపాత్ర వహించడం, అన్నివర్గాల వారిని కలుపుకొని పోయే తత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి గెలిచినందున అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తుందని చెబుతున్నారు. వివిధ సమీకరణాలు, రాష్ట్రంలో గెలిచిన ఇతర ప్రాంతాల వారినీ పరిగణనలోకి తీసుకుంటే.. నగరం నుంచి ఓసీకి ఇవ్వాలనుకుంటే కిషన్రెడ్డికి, బీసీకి ఇవ్వాలనుకుంటే రాజేందర్కు మంత్రి పదవి లభించగలదని భావిసున్నవారు ఉన్నారు. క్యూలో ‘కొండా’ సైతం.. కాగా.. చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డికి సైతం మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈటల రాజేందర్కు మంత్రిగా లేదా పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన ఎంపీలు సైతం ఎవరికి వారుగా తమకు మంత్రి పదవి లభించగలదనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మంత్రి పదవి ఎవరిని వరించనుందన్నది తేలాలంటే ప్రకటించేంతవరకు ఆగాల్సిందే. -
‘లోకల్’ రూట్లో కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. కీలక ఎన్నికలన్నీ ముగియడం, కేబినెట్లో బెర్తులు ఖాళీ ఉండటం నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా.. అన్ని జిల్లాలు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నాటికి విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ సహా 12 మంది మంత్రులు ఉన్నారు.మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునేందుకు వీలుంది. ఈ మేరకు కేబినెట్ కూర్పుపై సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించవచ్చనే చర్చ జరుగుతోంది. దీనికితోడు ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న పలు కీలక శాఖలను పంపిణీ చేసే క్రమంలో.. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారమే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. పాలన, పట్టు.. రెండింటిపై ఫోకస్తో.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక 12 మంది మంత్రులతోనే పరిపాలన కొనసాగుతోంది. కొన్ని కీలక శాఖలు ఇంకా సీఎం రేవంత్ వద్దనే ఉన్నాయి. గత ఐదు నెలల్లో మూడు నెలల పాటే పాలన సజావుగా సాగింది. రెండు నెలలకుపైగా ఎన్నికల కోడ్తోనే గడిచిపోయింది. పాలన విషయంలో పలు రకాల సమస్యలు అటు సీఎం, ఇటు కేబినెట్ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణతో త్వరలో పూర్తిస్థాయి పరిపాలన మొద లుపెట్టాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం కీలక ఎన్నికలన్నీ ముగిశాయి.లోక్సభతోపాటు పలు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు, తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. కొన్ని ఉమ్మడి జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ ‘స్థానిక’ ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పలు సామాజిక వర్గాలకు కేబినెట్లో స్థానం లేకపోవడం కూడా ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని నేతలు అంటున్నారు. కేబినెట్ విస్తరణతో ఈ ఇబ్బందులు తీరుతాయని పేర్కొంటున్నారు. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి! లోక్సభ ఎన్నికల సందర్భంగా కొందరు మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందన్న చర్చ జరుగుతోంది. కొందరు మంత్రులు ఇన్చార్జులుగా ఉన్న నియోజకవర్గాల్లో సరిగా పనిచేయకపోవడం, చాలా మంది మంత్రుల నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావడం వంటి అంశాలు నివేదికల రూపంలో అధిష్టానానికి చేరినట్టు తెలిసింది. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో స్వల్పంగా ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరు, రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తడంపై అధిష్టానం మన్ననలు పొందినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధిష్టానంతో చర్చించనున్న సీఎం! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. శనివారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు విందు ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర రాజకీయాల హడావుడి ముగిసిన తర్వాత ఆగస్టు నాటికి కేబినెట్ విస్తరణ జరగవచ్చని అంటున్నాయి.‘చాన్స్’పై సామాజిక వర్గం, జిల్లాలవారీ లెక్కలు!రాష్ట్ర కేబినెట్ నుంచి ఒకరిద్దరికి ఉద్వాసన ఉండవచ్చన్న ప్రచారం జరుగుతున్నా టీపీసీసీ నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. మంత్రులుగా నియామకమై చాలా తక్కువ సమయమే కావడంతో ఎవరి పనితీరు ఏమిటనేది అంచనా వేయడం సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. కానీ ఒకరిద్దరు మంత్రుల వ్యవహారశైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయన్న ప్రచారమూ ఉంది. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై మాత్రం ఆసక్తి నెలకొంది. కేబినెట్ ప్రస్తుత కూర్పును బట్టి.. కొన్ని ఉమ్మడి జిల్లాలు, కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కలి్పంచాల్సి ఉంది. అందులో ఎస్సీ (మాదిగ), ఎస్టీ (లంబాడా), బీసీ (ముదిరాజ్)లకు బెర్త్ ఖాయమని గాం«దీభవన్ వర్గాలు అంటున్నాయి. ⇒ పెద్ద బీసీ సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపులకు కేబినెట్ చాన్స్ రాలేదు. కొండా సురేఖ ఉన్నా ఆమెను పద్మశాలి కోటాలోనే లెక్క వేస్తున్నారు. ఈ క్రమంలో మున్నూరుకాపులకు విస్తరణలో చాన్స్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ⇒ ఇక కేబినెట్లో ముదిరాజ్లకు అవకాశమిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గానికి బెర్త్ దక్కే చాన్స్ ఉంది. ⇒ ఇతర వర్గాల విషయానికి వస్తే రెడ్డి ఎమ్మెల్యేల్లో ఒకరికి చాన్స్ ఉంటుందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకుంటే వెలమ వర్గాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. వెలమ కోటాలో ముగ్గురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ⇒ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కేబినెట్లో ఎవరికి స్థానం దక్కలేదు. ఇప్పటికే ఇక్కడ పార్టీ బలహీనంగా ఉండటం, రాష్ట్రానికి గుండెకాయ వంటి ప్రాంతానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం నష్టమన్న అంచనాలో పార్టీ ముఖ్యులు ఉన్నారు. దీనితో గ్రేటర్ హై దరాబాద్ పరిధి నుంచి ఒకరికి కేబినెట్ చాన్స్ రావొచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ⇒ కేబినెట్ కూర్పులో స్థానం దక్కని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఈసారి ప్రాతినిధ్యం కల్పిస్తారని నేతలు చెప్తున్నారు. ⇒ ఎవరికి చాన్స్ దక్కుతుందన్నదానిపై స్పష్టత లేకపోయినా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి లేదా వెలమ, జీహెచ్ఎంసీ, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల కోటా లెక్కల్లోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతోంది. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్ ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేశ్రెడ్డి లకు రాలేదు. ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపునకు అవసరమైన టార్గెట్ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్ రీచ్ అయ్యే వరకు వేచి ఉండాలా అని, ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. అప్డేట్స్హోరాహోరీగా సాగిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మూడో రోజు.. కొనసాగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటివరకు 44 మంది అభ్యర్థులను ఎలిమినేట్తీన్మార్ మల్లన్న ( కాంగ్రెస్) : 1,23,873రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 1,04,990గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి: 43,797గెలుపు కోటాకు −31,222 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నగెలుపు కోటాకు 50105 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిఅశోక్ ఫలితాలను వెల్లడించని అధికారులుఅశోక్ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత మొదలుకానున్న బీజేపీ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శుక్రవారం మధ్యాహ్నానికి 37 మంది ఎలిమినేట్కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,676 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 29,862 ఓట్లు గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, 50,419 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి ఉన్నారు.మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచ్చినా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. -
ఇకపై.. తెలంగాణలో ఆ పార్టీలే కీలక పాత్ర పోషించనున్నాయా?
తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సగం మోదం, సగం ఖేదం దక్కింది. కాంగ్రెస్ పార్టీకి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు వస్తాయని ఆ పార్టీ అంచనా వేసినా, ఎనిమిదితోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. గతంలో నాలుగు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఎనిమిదికి పెరగడం విశేషం. ఈ పార్టీకి శాసనసభలో కూడా ఎనిమిది మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. కచ్చితంగా బీజేపీకి ఇది మేలి మలుపువంటిదే.2028 శాసనసభ ఎన్నికలలో గట్టిగా పోటీ పడడానికి ఈ ఫలితం ఉపకరిస్తుంది. బీఆర్ఎస్కు పార్లమెంటు ఎన్నికలు పూర్తి నిరాశ మిగిల్చాయి. పార్టీకి భవిష్యత్తు మీద ఆశ ఉన్నా, జనంలో పట్టు సాధించడానికి చాలా శ్రమపడవలసి ఉంటుంది. కాంగ్రెస్ సంగతి చూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరిగిన తొలి ముఖ్యమైన ఎన్నికలు. ఇందులో పదికి పైగా సీట్లు వచ్చి ఉంటే ఆయనకు పార్టీలో మంచి పేరు వచ్చేది. కానీ ఎనిమిది సీట్లే వచ్చాయి. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే బీజేపీకి కూడా అన్ని సీట్లే వచ్చాయి కనుక. ఒకవేళ బీజేపీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్కు చికాకుగా ఉండేది. అంతవరకు కాంగ్రెస్కు, రేవంత్కు మోదం కలిగించే అంశమే.అయినా ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే కాంగ్రెస్కు ఇది కొంత ఇబ్బంది కలిగించే ఫలితంగానే చూడాలి. అరవైనాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్కు ఎనిమిది సీట్లే. కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఎనిమిది సీట్లు అన్న వ్యాఖ్య సహజంగానే వస్తుంది. రేవంత్కు ఎక్కడ సమస్య వస్తుందంటే ఆయన ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ అసెంబ్లీ సీటు ఉన్న మహబూబ్నగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నేత డీకే అరుణ విజయం సాధించడం. ఆమెను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు. అయినా ఓడించలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓటమి చెందారు. కొందరు కాంగ్రెస్ నేతలే సహకరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నైతిక ప్రభావం రేవంత్పై కొంత ఉటుంది.అలాగే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ గెలిచారు. ఇది కూడా ఆయనకు అసంతృప్తి కలిగించేదే. ఎందుకంటే ఈ రెండు సీట్లను కాంగ్రెస్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదే టైమ్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతంలోని నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలిచింది. అంటే రేవంత్ కన్నా స్థానికంగా తామే బలవంతులమన్న సంకేతాన్ని వీరు ఇచ్చారు. మాజీ మంత్రి కే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఏకంగా రికార్డు స్థాయిలో 5.80 లక్షల ఓట్ల ఆధిక్యతతో నవిజయం సాధించడం ఒక సంచలనం. నల్గొండ కాంగ్రెస్కు గట్టి స్థావరమే అయినా, ఈ స్థాయిలో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.భువనగిరిలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకు సన్నిహితుడుగా పేరొందారు. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పక్షాన మరోసారి గెలిచి తన సత్తా చాటారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ గెలిచినా, ఈ ఎన్నికలలో కిషన్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. మల్కాజిగిరిలో లోకసభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుంటే బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన ఈటెల రాజేందర్కు అదృష్టం కలిసి వచ్చింది. బీఆర్ఎస్ బలం అంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్ను వ్యతిరేకించే బీఆర్ఎస్ నేతలు తమకు ఏదైనా అవసరం వస్తే షెల్టర్గా ఉపయోగపడుతుందన్న భావనతో బీజేపీకి పరోక్షంగా సహకరించి ఉండాలి. లేదా ప్రజలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల కన్నా బీజేపీ బెటర్ అన్న భావన ఏర్పడి ఉండాలి. కాంగ్రెస్కు మహబూబ్నగర్తో పాటు మల్కాజిగిరి సీటులో ఓటమి ఎదురవడం పార్టీలో చర్చ అవుతుంది. ఇప్పటికిప్పుడు రేవంత్ను ఎవరూ ఏమి అననప్పటికి, కాలం గడిచే కొద్ది జరిగే పరిణామాలలో కాంగ్రెస్ నేతలే దెప్పి పొడిచే అవకాశం ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ తనను బలి చేసుకుని బీజేపీకి సాయపడిందని రేవంత్ వ్యాఖ్యానించారు.2019 ఎన్నికలలో నాలుగు సీట్లే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎనిమిది తెచ్చుకుందని ఆయన చెప్పవచ్చు కానీ కేవలం మాట వరసకు సమర్ధించుకోవడమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉందన్న సంగతి మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం మైనస్గా ఉంది. దాని ప్రభావం కొన్ని ఏరియాలలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల వంటి పార్లమెంటు సీట్లలో చోట్ల బీజేపీ పాగా వేసింది. ఈ స్థానాలలో కాంగ్రెస్ పట్టు సాధించలేకపోయింది. ఇది ఆ పార్టీకి బలహీనతగానే ఉంటుంది. కాంగ్రెస్ ఈ స్థానాలలో నిలబెట్టిన ఫిరాయింపుదారులంతా ఓటమిపాలయ్యారు.సికింద్రాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేయగా, బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా చేవెళ్ల నుంచి, మరో బీఆర్ఎస్ నేత పీ మహేందర్ రెడ్డి భార్య సునీత మల్కాజిగిరి నుంచి పోటీచేసి పరాజయం చెందారు. వరంగల్ లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి ఊహించిన రీతిలో ఘనంగా గెలిచారు. మరో మాజీ మంత్రి బలరాం నాయక్ మహబూబబాద్లో విజయం సాధించారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే జి వివేక్ కుమారుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలులో సీనియర్ నేత మల్లు రవి గెలుపొందారు. ఈ ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయానికి సూచిక అని కిషన్ రెడ్డి అన్నప్పటికీ అది అంత తేలికకాదు.ప్రస్తుతం 38 అసెంబ్లీ సీట్లు ఉన్న బీఆర్ఎస్ ఈ పార్లమెంటు ఎన్నికలలో ఆశలు వదలుకుంది. అందువల్లే వారు అసలు గెలవలేకపోయారు. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ ఏ రకంగా ప్రజలను ప్రభావితం చేయగలుగుతారన్న దానిపై కూడా బీజేపీ విజయావకాశాలు ఉంటాయి. బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు. ఈ నాలుగేళ్లలో ఎంతవరకు పెంచుకుంటారో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ఒక వేవ్ మాదిరి మెదక్ తదితర చోట్ల గెలిచారు. మెదక్లో బీజేపీ నేత రఘునందనరావు విజయం సాధించారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఎంపీ అయ్యారు. కేసీఆర్, హరీష్రావు ప్రాతినిద్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఈ ఎంపీ సీటు పరిధిలోనే ఉన్నప్పటికీ బీజేపీ గెలవడం వారికి కాస్త అప్రతిష్టే అని చెప్పక తప్పదు.ఇంతవరకు బీఆర్ఎస్ ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తోంది. కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్లు మరోసారి గెలవడం ద్వారా బీజేపీ పట్టు నిలబెట్టుకున్నట్లయింది. ఎప్పటి నుంచో ఎంపీ కావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ నేత టీ జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ జీ నగేష్ గెలుపు సాధించారు. మహబూబ్నగర్లో గెలిచిన డీకే అరుణ సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరి టిక్కెట్ సంపాదించారు. ఆ పార్టీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని ఈమెకు సీటు ఇచ్చింది. ఇక చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గెలుపొంది గతంలో కోల్పోయిన పట్టును తిరిగి పొందారు. ఈయనది ఒకరకంగా వ్యక్తిగత విజయంగా చెప్పుకోవచ్చు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి హైదరాబాద్ నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు.ఈ మొత్తం ప్రక్రియలో బాగా దెబ్బతిన్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. లోక్ సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సభలకు జనం బాగానే వచ్చారు. అయినా ఒక్క సీటు కూడా రాకపోవడం వారికి బాధాకరమైన విషయమే. కాకపోతే ఇదేమీ ఊహించని విషయం కాదు. ఇప్పుడు వారు పార్టీ పునర్మిర్మాణంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి తిరిగి పార్టీని పెంపొందిస్తేనే వచ్చే శాసనసభ ఎన్నికలలో నెగ్గే అవకాశం ఉంటుంది.బీజేపీ ఇంకా పుంజుకుంటే బీఆర్ఎస్కు గడ్డు కాలమే అవుతుంది. ఈ లోగా బీజేపీ లేదా కాంగ్రెస్తో పొత్తులోకి వెళితే అప్పుడు రాజకీయాలు మరోరకంగా ఉంటాయి. దానిపై అప్పుడే ఒక కంక్లూజన్కు రాలేము. కాంగ్రెస్, బీజేపీలకు చెరి సమానంగా సీట్లు రావడం ద్వారా ఈ రెండుపార్టీలే భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలలో మెయిన్ ప్లేయర్లుగా ఉంటాయా అనే చర్చ జరగవచ్చు. కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను అంత తొందరగా తీసివేయలేం.ఫీనిక్స్ పక్షి మాదిరి మళ్లీ పైకి లేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడం బాగానే ఉంది కానీ, అందుకు చాలా వ్యూహాలు అమలు చేయవలసి ఉంటుంది. మళ్లీ జనంలో బీఆర్ఎస్పై విశ్వాసం పెంచుకోగలగాలి. కాంగ్రెస్, బీజేపీలకన్నా తామే బెటర్ అని ప్రజలలో నమ్మకం కలిగించగలగాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాలలో మరికొన్నిటిని అయినా అమలు చేసి ప్రజలలో పరపతి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి బీజేపీ కాచుకు కూర్చుని ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అధికారులపై ఆరోపణలు సరికాదు
నల్లగొండ: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గట్టెకే పరి స్థితి లేక.. కౌంటింగ్ హా ల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మట్టిపోసి పోయే పనులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై, జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్నికలో రూ.100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందాలని చేసిన ప్రయత్నం..బోగస్ ఓట్లతో లబ్ధిపొందాలనే కుతంత్రం బెడిసి కొట్టడంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుస్తాం: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్నరోజుల్లో రాష్ట్రంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతామని, అధికారంలోకి వచ్చేందుకు సమష్టిగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, ప్రజలు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీని చూస్తున్నారని తెలిపారు. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం, బీఆర్ఎస్ ఉనికి కోల్పోయాయని దుయ్యబట్టారు. ప్రజల గుండెచప్పుడై సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే.. ఇప్పటి వరకు బీజేపీ తొలిసారి గణనీయమైన స్థానాలు సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ తొండిఆట ఆడింది బీజేపీ మూడోసారి గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ తొండిఆట ఆడిందని కిషన్రెడ్డి అన్నారు. అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. ఇంత చేసినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారని చెప్పారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని అన్నారు. ఆ పార్టీ మోసాలను ఎండగతామని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు. బెదిరించినా, భయపెట్టినా విజయం సాధించాం లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి బెదింరిపులకు పాల్పడినా, భయపెట్టినా ఆయన సొంత జిల్లాతోపాటు, మల్కాజిగిరిలోనూ బీజేపీ విజయం సాధించిందని కిషన్రెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా, బీఆర్ఎస్కు కంచుకోటలాంటి మెదక్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారని చెప్పారు. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం 39 కాగా.. ఇప్పుడు 40 శాతానికి పెరిగిందని చెప్పారు. ఈ ఎన్నికలు ఆరు నెలల పాలనకు రెఫరెండంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క శాతం ఓట్లు మాత్రమే అదనంగా సాధించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచి 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచామని చెప్పారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ చేసినట్టు ఉందని, నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కిషన్రెడ్డి ఆరోపించారు. రామమందిరం రాజకీయఅంశం కాదు దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఆధారంగానే బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని, రామమందిరం రాజకీయ అంశం కాదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషలకు నిలయమైన దేశంలో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీకి కిషన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి ఆరోపించారు. 3వ రౌండ్లో తనకు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అభ్యరి్థకి మెజారిటీ ఉందంటూ ప్రకటించారని, కౌంటింగ్పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రాకేష్రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ఏకపక్షంగా చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే 3వ రౌండ్ లీడ్ను ప్రకటించారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. 3వ రౌండ్ ఫలితాలు అడిగితే బయటకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని, మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ రౌండ్ ఫలితాలు ప్రకటించే విషయంలో కౌంటింగ్ ఏజెంట్లకు చూపించకుండా ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని అన్నారు. అడిగితే అనుమానం నివృత్తి చేయడం లేదని, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తారుమారు జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. -
పనికిరాని ప్రాజెక్టుకు మరమ్మతులెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం త ప్పుదారిలో పడింది. ఈ ని ర్ణయం వల్ల కాంగ్రెస్కే నష్టం జరుగుతుంది. పనికిరాని ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం సరికాదు’అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చూస్తే ఎన్నికల వరకే కొట్లాటలు ఉంటాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పరిధిలోని జంట జలాశయాల పరిరక్షణకు సంబంధించి గత ప్ర భుత్వం జీఓ 111 రద్దు చేసినా, దాని కంటే కూడా నిరర్థకమైన జీఓ 69ను కొత్తగా తీసుకొచ్చిందని విమర్శించారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధి కూడా జరగాలంటే ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ ఏరియా’గా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో విషం నింపిందని మండిపడ్డారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ వేవ్తోనే తాను చేవెళ్లలో పెద్ద మెజారిటీతో గెలుపొందానని చెప్పారు. కేంద్ర కేబినెట్లో మీకు పదవి ల భించనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విశ్వేశ్వర్రెడ్డి స్పందిస్తూ ‘కేంద్రమంత్రి అయితే నాకు రాజకీయంగా నష్టం. దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బాధ్యతల కారణంగా చేవెళ్ల ప్రజలకు దూరం అవుతా. కానీ నాకున్న పరిజ్ఞానం దేశం మేలు కోసం ఉపయోగించాలని ఉంది’ అని అన్నారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మరింత బలపడే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రానికి ప్రాధాన్యత కలి్పస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగా రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేంద్ర కేబినెట్ పదవితోపాటు ఓ మహిళ, ఓ బీసీ నేతకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డికి మరోసారి కేబినెట్ హోదా లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.అయితే ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలున్నాయనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. వెంటనే జాతీయ స్థాయిలో అధ్యక్ష మార్పు జరపకపోతే ముందుగా కిషన్రెడ్డిని కేబినెట్లోకి తీసుకొని 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని పేర్కొనడం ఈ చర్చకు ఊతమిస్తోంది.ఓసీ, మహిళా కోటాలో డీకే అరుణకు, పారీ్టపట్ల విధేయుడిగా రెండోసారి ఎంపీగా సీనియారిటీ దృష్ట్యా బండి సంజయ్, రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా రాజకీయవేత్తగా, మంత్రిగా ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా ఈటల రాజేందర్కు మంత్రి పదవులు దక్కుతాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక క్షేత్రస్థాయిలో బీజేపీ అంతగా బలపడలేదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీపరంగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా అంతంతగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సత్సంబంధాలు, స్థానిక పరిచయాలున్న ఈటల రాజేందర్ను కేంద్ర మంత్రిగా కంటే కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసి పార్టీ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారనే చర్చ సాగుతోంది. -
ఇంకా తేలని ‘ఎమ్మెల్సీ’ ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచి్చనా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గెలుపెవరిదో? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 18,565 మాత్రమే ఉంది. తీన్మార్ మల్లన్న గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు సాధించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యతలో 1,04,248 ఓట్లు రాగా, ఆయన గెలవాలంటే 50,847 ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్వంతంత్ర అభ్యర్థి అశోక్కు కూడా భారీగానే ఓట్లు లభించాయి. మొత్తం 52 మంది అభ్యర్థులలో ఈ నలుగురు అభ్యర్థులకు 3,00,071 ఓట్లు వచ్చాయి.మిగిలిన అభ్యర్థులందరికీ 10,118 ఓట్లు లభించాయి. ఇవన్నీ ఎలిమినేషన్లో క్రమంగా పోనున్నాయి. ఈ ఓట్లను లెక్కించినా గెలుపు టార్గెట్ను అభ్యర్థులు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. చివరగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తరువాతే ఫలితం వెల్లడి కానుంది. రెండు రోజులుగా కౌంటింగ్ ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఓట్లు 4,63,839 కాగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పత్రాలను బండిల్స్గా కట్టడానికే సరిపోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఆ తరువాత గెలుపునకు టార్గెట్ 1,55,096 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత శుక్రవారం తుది ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్పై వేయి ఓట్ల చొప్పున గురువారం రాత్రి వరకు నాలుగు రౌండ్లలో 3,36,013 ఓట్లను లెక్కించారు. అందులో 3,10,189 ఓట్లు చెల్లినవిగా తేల్చారు. 25,824 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ లెక్కింపు ఒకటో రౌండ్ ఫలితం బుధవారం రాత్రి 12:45 గంటలకు వెలువడగా, రెండో రౌండ్ ఫలితం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడైంది.మూడో రౌండ్ ఫలితం సాయంత్రం 5 గంటలకు వెల్లడించగా, 4వ రౌండ్ ఫలితం రాత్రి 9 గంటలకు వెల్లడైంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటరి్నంగ్ అధికారి దాసరి హరిచందన నేతృత్వంలో సిబ్బందికి మూడు షిప్టులలో వి«ధులు కేటాయించి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. -
చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఫోన్
హైదరాబాద్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకుగానూ అభినందనలు తెలియజేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, అలాగే విభజన హామీలు.. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కృషి చేద్దామని చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ లోక్ సభ ఎన్నికలో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటం సంతోషకరం. కాంగ్రెస్, బీఆర్ఎస్ను కాదని బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసం చూపించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు. తెలంగాణలో బీజేపీ బలపడటం ఒక ఆరంభం మాత్రమే. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఇకపై భవిష్యత్తు మాదే. తెలంగాణలో పదేళ్లలో పది లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ విష ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి పోలింగ్ శాతం తగ్గింది.సీఎం రేవంత్రెడ్డి గతంలో గెలిచిన మల్కాజిగిలో మాకు 4 లక్షల మెజార్టీ వచ్చింది. కంచుకోట మెదక్లో వందల కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీనే గెలిచింది. సికింద్రాబాద్లో కాంగ్రెస్ పేరుతో మజ్లిస్ పోటీ చేసింది. 8 చోట్ల మేం గెలిచాం. ఆరేడు స్థానాలో రెండో స్థానంలో నిలిచాం. బీఆర్ఎస్ 14 చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది ’’అని కిషన్రెడ్డి అన్నారు. -
తేడా ఎక్కడ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మూడు పార్లమెంటు సెగ్మెంట్లలో విస్తరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ తన రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోగా, కొత్తగా కాంగ్రెస్ పెద్దపల్లి స్థానంలో పాగా వేసింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కీలకమైన కరీంనగర్ సెగ్మెంట్లో ఓటమిపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ తీవ్ర అంతర్మథనంలో పడ్డాయి. ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డపై మూడోస్థానానికి పరిమితవడాన్ని బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేక పోతుండగా, రాష్ట్రమంతా హస్తం హవా వీస్తున్న వేళ.. కరీంనగర్, నిజామాబాద్లలో ఆశించిన ఫలితాలు రానందుకు కాంగ్రెస్ పార్టీ మదనపడుతోంది. తేడా ఎక్కడ జరిగిందన్న విషయంపై ఉమ్మడి జిల్లా నేతలు లెక్కలు వేస్తున్నారు.బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ ఎదురుదాడి..ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు ఉమ్మడి కరీంనగర్ పుట్టినిల్లు. అలాంటి కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అది కూడా మూడోస్థానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనపడిందని పార్లమెంట్ ఫలితాలే చెబుతున్నాయి.. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగుచూడటం ఇరకాటంలో పడేసింది. ఈ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఎదురుదా డిని బీఆర్ఎస్ తిప్పికొట్టలేదన్న విమర్శలున్నాయి.కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ స్థానికేతరుడంటూ బీజేపీ, కాంగ్రెస్ అటాక్ చేశాయి. ఫలితంగా ఒకప్పుడు 2.05 లక్షల మెజారిటీతో గెలిచిన ఆయన ఇప్పుడు కేవలం 2.80 లక్షల ఓట్లకు పరిమితమయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిపిన కారు పార్టీకి ఇక్కడా పరాభవం తప్పలేదు. ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. పార్లమెంట్ పరిధిలో ఎక్కడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.ఇక, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఓడిపోయారు. కోరుట్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఆలస్యమే కారణమా?కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. తన అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ప్రకటించినా ప్రచారంలో దూసుకెళ్లారు. గత ఎన్నికలతో పోల్చినపుడు 1.80 లక్షల ఓట్లు అదనంగా సాధించడమే ఇందుకు నిదర్శనం. ఆయన అభ్యర్థిత్వాన్ని మరికాస్త ముందు ప్రకటిస్తే మరింత మెరుగ్గా రాణించి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 4.75 లక్షల ఓట్లతో సత్తా చాటారు. తాత, తండ్రి తర్వాత మూడో తరం కూడా అదే స్థానం నుంచి గెలిచి, రికార్డు దక్కించుకున్నారు.నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఓటమిపై పార్టీ శ్రేణులు నిరాశ చెందాయి. 4,83,077 ఓట్లు సాధించినా ఆయన విజయానికి లక్షకు పైగా ఓట్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.బీజేపీలో జోష్..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ జోష్ కనిపించింది. సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్లను తిరిగి కైవసం చేసుకుంది. అదే సమయంలో పెద్దపల్లి స్థానంలో గెలిచినంత పని చేసింది. ఈ మూడు స్థానాల్లో బీజేపీ ప్రదర్శనకు కారణం ఎన్నికల సమయంలో మోదీ జగిత్యాల, వేములవాడ సభలే. కేడర్లో జోష్ నింపడంలో బీజేపీ అధిష్టానం సక్సెస్ అయ్యింది.జీవన్రెడ్డి పోటీకి దిగడంతో ఆరంభంలో నిజామాబాద్లో ఆందోళన కనిపించినా.. క్రమంగా సెగ్మెంట్ను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. ఫలితంగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండోసారి విజయం సాధించారు.ఇక, పెద్దపల్లిలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. గోమాసె శ్రీనివాస్ 3.44 లక్షల ఓట్లు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక దశలో గెలుస్తారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్కు ప్రతీ రౌండ్లో గట్టి పోటీ ఇచ్చారు.కరీంనగర్లో బండి సంజయ్ 2.25 లక్షల ఓట్ల మెజారిటీలో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రత్యర్థులిద్దరూ ఓసీలవడం, బీసీల ఓటు బ్యాంకు కలిసి వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.బీఆర్ఎస్ ఓట్లు ఎటు పడ్డట్టు?ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఓట్లు పెరిగి, బీఆర్ఎస్ ఓట్లు అదే స్థాయిలో పడిపోయాయి.బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో ఓటేసిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ పక్షం వహించారని, బీసీలు, అగ్రవర్ణాలు బీజేపీ వైపు మళ్లారని జిల్లా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ఓట్లను పరిశీలించినపుడు బీజేపీ, కాంగ్రెస్లకు ఓట్లు అనూహ్యంగా పెరిగిన విషయం తేటతెల్లమవుతుంది. కారు పార్టీ ఓట్లను ఈ రెండు పార్టీలు పంచుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇవి చదవండి: హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్గొండ: వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్లోనూ లీడ్లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో ఆయనకు 34,575 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో రౌండ్ ఫలితాలుకాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.