-
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్రాజ్ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. నూతన సీఈవోగా నియమితులైన సుదర్శన్రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.కాగా, తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వికాస్ రాజ్ నిర్వహించగా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వికాస్ రాజ్ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా ఈసీ నియమించింది. -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్రావు ములాఖత్
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పాటు మాజీ మంత్రి హరీష్రావులు ములాఖత్ అయ్యారు. అరగంట పాటు సాగిన ములాఖత్లో ధైర్యంగా ఉండాలని.. కేసు విషయంపై న్యాయం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో తదుపరి కార్యచరణకు సిద్ధం కాగా.. అన్నీ అంశాలపై ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే విషయంపై హరీష్ రావు, కేటీఆర్.. కవితతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు కవిత బెయిల్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదలతో కేటీఆర్, హరీష్ రావులు చర్చించగా.. న్యాయవాదుల సలహా మేరకు సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని సీతక్క నోటిసులు జారీ చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇసుకాసురుల రాజ్యం’ వీడియో ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని సీతక్క ఆరోపణ.వంద కోట్లకు పరునష్టం దావా వేసిన మంత్రి సీతక్క.. బేషరతుగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టులు పెట్టారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది పద్దతి కాదని ఆమె పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత వివాదం.. వేడెక్కుతున్న వరంగల్ పాలిటిక్స్
సాక్షి, వరంగల్: వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత వివాదం ముదురుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. పార్క్ స్థలం ఎకరం భూమి ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించుకుని ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయానికి ఇంటి నంబర్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వరంగల్ బీఆర్ఎస్ నేతలను స్టువర్ట్ పురం చెడ్డి గ్యాంగ్ దొంగలుగా రాజేందర్ రెడ్డి అభివర్ణించారు. భూ ఆక్రమణలు చేసిన బీఆర్ఎస్ నేతల మీద రౌడి షీట్ ఓపెన్ చేసి చెడ్డిల మీద తిప్పాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలైనా వదిలిపెడతాను కానీ... వినయ్ భాస్కర్ చేసిన పాపాలను వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే నాయిని నిప్పులు చెరిగారు. -
బీఆర్ఎస్ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా.. వారంతా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, వారంతా పార్టీ మారుతున్నారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పోరేటర్లు రెడీ అయ్యారు.కాగా, తెలంగాణ భవన్లో నేడు హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మినహా కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. రేపు మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినిపించనున్నారు. ఈ క్రమంలోనే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు రెడీ అయ్యారు.అయితే, రేపటి సమావేశంలో కౌన్సిల్ హాల్లోనే బైఠాయించాలని వారు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. సంఖ్యా బలం చూసుకుంటే తమకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెబుతున్నారు. దీంతో, రేపటి సమావేశం ఆసక్తిగా మారే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఈరోజు జరిగిన సమావేశానికి హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో హాట్ టాపిక్గా మారింది. ఈ సమావేశానికి మాధవరం కృష్ణారావు, అరికేపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో, వీరు పార్టీ మారుతున్నారా? అనే చర్చ మొదలైంది. -
ఎక్కడికక్కడే అరెస్టులు.. టీజీపీఎస్సీ వద్ద హైటెన్షన్
హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు. బీజేవైఎం, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. -
బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్కు ఊహించని షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరగా.. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది.కాగా, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో భేటీ కూడా అయ్యారు. ఇక, ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరిన గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సరితా తిరుపతయ్యతో రేవంత్ భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సరితకు నచ్చజెప్పినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యే కృష్ణమోహన్ కాంగ్రెస్లో చేరినా సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
‘నిఘా’కు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం రేవంత్రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ కలిశారు. సుమారు గంటపాటు షాతో భేటీ అయ్యారు.డ్రగ్స్ కట్టడి, సైబర్ నేరాల నియంత్రణకు కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాబ్కు రూ. 88 కోట్లు, టీజీ సీఎస్బీకి రూ.90 కోట్లు కేటాయించాలని అమిత్ షాను కోరారు. ఐదేళ్లకోసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసరని, తెలంగాణకు సంబంధించి 2016లో తొలిసారి సమీక్ష నిర్వహించారని, నాటి నుంచి సమీక్ష చేయనుందున వెంటనే సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్లు సరిపోనందున.. తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.మరికొన్ని వినతులు⇒ తెలంగాణలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భద్రతా దళాల క్యాంపులను ఏర్పాటు చేయాలి. ⇒ వామపక్ష తీవ్రవాదం అణచివేత కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సీఆరీ్ఫఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. ⇒ మావోయిస్టుల ఏరివేతకు ఏర్పాటు చేసిన ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులనే చేర్చుకోవాలన్న నిబంధనను సవరించి 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి అనుమతించాలి. ⇒ ఎస్పీవోలకు చెల్లించాల్సిన నిధుల్లో నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న 60% కేంద్రం వాటా కింద రూ.18.31 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ⇒ ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలి. షెడ్యూల్–9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్–10లోని సంస్థల వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారానికి కృషి చేయాలి. ళీ విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకుంటున్నందున అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా చొరవ చూపాలి. -
సోయిలేకే మొదటి నుంచి తెలంగాణ ఆగం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలో నాటి ఆంధ్రానాయకత్వ స్వార్థంతోపాటు, తెలంగాణ నాయకత్వం సోయిలేనితనం కారణంగానే రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం విద్యుత్, వ్యవసాయరంగంలో తెలంగాణకు ఉద్దేశపూరితంగా చేసిన ద్రోహాలు పసిగట్టంలో విఫలమైందన్నారు.ఆ సమయంలో తెలంగాణ సమస్యలను కవులు, కళాకారులు సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలతో ఓ వైపు వ్యాప్తి చేయడం, మరోవైపు టీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ.. జమిలిగా సాగిన భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సాధించామని కేసీఆర్ పేర్కొన్నారు.ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కవితల పుస్తకాలు కేసీఆర్కు అందించారు. ఈ సందర్భంగా ఇద్దరూ తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. శాంతియుత పద్ధతిలో సాగిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్లలో కేసీఆర్ పాలన ఆదర్శవంతంగా సాగిందని గోరటి తనదైన సాహిత్య శైలిలో వివరించారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన ‘పిట్ట వాలిన చెట్టు’పుస్తకాన్ని కేసీఆర్కు అందించారు. ఈ పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వర్దెల్లిని అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ గతించిన చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ గతించిన చరిత్ర అని, ఆ పార్టీకి గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. టార్చ్ వేసుకుని ప్రజలు రావడం కాదని, బీఆర్ఎస్ ఎక్కడుందో టార్చ్ వేసుకుని కేసీఆర్ వెదుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అనంతరం.. తన అధికారిక నివాసంలో డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడుంది? టార్చ్లైట్ వేసి వెతకాల్సిందే కదా.. లోక్సభలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 ఏళ్లలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు..’అని రేవంత్ అన్నారు. బీజేపీ నాయకులు కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఇతర రాష్ట్రా ల్లో వారి పార్టీ దీనావస్థను దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే బాగుంటుందని సీఎం అన్నారు.కేసీఆర్పై ఈటలకు ప్రేమ తగ్గనట్టుంది!బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని.. 20 సంవత్సరాలు ఈటల ఎవరితో కలిసి తిరిగారో గుర్తు చేసుకోవాలని రేవంత్ సూచించారు. గతంలో కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు, కండువాలు కప్పేటప్పుడు ఈటల ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. అసలు 11 రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిన విషయమైనా ఈటలకు తెలుసా..? అని నిలదీశారు. ‘ఇప్పటికీ కేసీఆర్పై ఈటలకు సానుభూతి ఎందుకు? ఆయనపై ఇంకా ప్రేమ తగ్గనట్లు ఉంది.అయినా వారిద్దరూ ప్రేమించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ల నాయకుడు ఇంకా కేసీఆరే అని ఈటల అనుకుంటున్నట్లున్నారు..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తర్వాత తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే ఉంటుందని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ అంశాలు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. పదవుల విషయంలో తమకు ఏకాభిప్రాయం ఉందని, ఎందుకు ఆలస్యం అవుతోందో ఏఐసీసీ పెద్దలనే అడగాలని అన్నారు. ఇలావుండగా భద్రాచలానికి సమీపాన ఏపీలో ఉన్న ఐదు గ్రామాలు, దేవుడి మాన్యాలను తెలంగాణలో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. -
మన పాలన లేక దేశ రైతాంగానికి నష్టం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ పాలన లేకపోవడంతో మహారాష్ట్రతోపాటు దేశం కూడా నష్టపోయిందనే భావన కొందరు మహారాష్ట్ర నేతలు తనవద్ద వ్యక్తం చేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారన్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం తనను కలిసేందుకు వచి్చన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ‘విద్యుత్, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణతో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారు. ఆబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో రైతురాజ్యం తెచ్చుకోవాలని బీఆర్ఎస్తో కలిసి అడుగులు వేశారు. దేశ రైతాంగం పురోగతికి బయలుదేరిన బీఆర్ఎస్పై తెలంగాణ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతులను నిరుత్సాహ పరిచింది’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలదే అంతిమ నిర్ణయం ‘ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం. అధికారం, ప్రతిపక్ష పాత్ర మనకు శాశ్వతం కాదు..ప్రజాతీర్పే శిరోధార్యం. వారు ఏ పాత్ర అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదు. ప్రజాసంక్షేమానికి కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం. దానికి గెలుపోటములతో సంబంధం ఉండదు. ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యల మీద నిరంతర పోరాటం ద్వారా అభిమానాన్ని సాధించాలి. గత ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించక పోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతోంది. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం.నిరంతరం ప్రజాక్షేత్రంలో పనిచేయాలంటూ’పార్టీ కేడర్కు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. సమాచారం లేకుండా రావొద్దు ముందస్తు సమాచారం లేకుండా తనను కలిసేందుకు వచ్చి ఇబ్బంది పడొద్దని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నుంచి అందే సమాచారం తర్వాతే స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకొని రావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కేసీఆర్ తిరిగి సీఎం కావాలని నినాదాలు చేశారు. గురువారం కేసీఆర్ను కలిసిన వారిలో ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ నర్సాపూర్ ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. -
గద్వాల కాంగ్రెస్లో లొల్లి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గద్వాల కాంగ్రెస్లో చేరికల చిచ్చు రాజుకోగా.. నడిగడ్డలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆ పారీ్టలో అలజడి సృష్టిస్తోంది. ప్రధానంగా తాజా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ ఆమె వర్గానికి చెందిన అనుచరులు, అభిమానులు రోడ్డెక్కుతున్నారు.నియోజకవర్గంలోని గద్వాల మున్సిపాలిటీతోపాటు కేటీదొడ్డి, మల్దకల్, గట్టు మండలాల్లోని పలు ప్రాంతాల్లో సరిత వర్గానికి చెందిన నాయకులు గురువారం ధర్నాలకు దిగారు. గద్వాల పట్టణంలోని రాజీవ్మార్గ్లో ప్రసాద్ అనే వ్యక్తి సెల్టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. సరిత గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. శనివారం స్పష్టత..ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి శుక్రవారం గద్వాల పట్టణంలో బీఆర్ఎస్కు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు తన అభిమానులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్లో చేరాలని మంత్రి జూపల్లిని సంప్రదించిన మాట వాస్తవమేనని చెప్పారు. కాగా, శనివారం హైదరాబాద్కు రమ్మని ఎమ్మెల్యే బండ్లకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫోన్చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఏ రోజు కాంగ్రెస్లోకి వస్తారన్నది శనివారం తేలనుంది. -
కాంగ్రెస్లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్లో చేరగా, రాజ్యసభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్రావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరనుంది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. -
ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది: కేకే ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాతిరోజు సీనియర్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ నా సొంత ఇల్లు. నేను కాంగ్రెస్ మనిషిని. తిరిగి పార్టీలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా కూడా ఉంది. నైతిక విలువలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇదే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ కూడా అదే చెప్పాను అని అన్నారాయన. అలాగే.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపైనా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కాంగ్రెస్ ఎంపీల పోరాటం వల్లే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక పాలన ప్రజాస్వామ్య బద్దంగా ఉంది. ఆరు నెలల్లో ఎవరిని కూడా అంచనా వెయలేం. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవాళ్లు. కానీ, ఈ ఆరు నెలల్లో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలనే చూశా అని అన్నారు. కేకేకు ప్రత్యేక సలహాదారు పదవి?రెండేళ్ల పదవీకాలం ఉండగానే కేకే రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో ఆ సీటు మరొకరికి దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే త్వరలో కేకేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవి దక్కవచ్చనే ప్రచారం ఒకటి మొదలైంది. -
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు గురువారం అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కేశవరావు ఆ పార్టీ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు పార్టీ మారడంతో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.రాజీనామా సమర్పించిన అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారని.. బీఆర్ఎస్ సింబల్పై ఎన్నికైన నేపథ్యంలో రాజీనామా చేశానని తెలిపారు. నైతిక విలువలు పాటించి, చట్టానికి కట్టుబడి రాజ్యసభ సీటుకు రాజీనామా చేశానని.. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా సమర్పించానని కేశవరావు చెప్పారు. -
ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా..? హరీష్రావు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల వరుస మరణాలపై హరీష్ రావు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూప లేదనే ఆవేదనతో... సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం.ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు… pic.twitter.com/xwPPUVtJ4E— Harish Rao Thanneeru (@BRSHarish) July 4, 2024 రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమన్న హరీష్.. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని ధ్వవజమెత్తారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని హరీష్రావు డిమాండ్ చేశారు. -
ఎన్నికలప్పుడే రాజకీయాలు: సీఎం రేవంత్
సాక్షి, ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయని.. మాకైతే ఏకాభిప్రాయం ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎందుకు ఆలస్యం అవుతుందో ఏఐసీసీ పెద్దలనే అడగాలన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పని చేస్తామని రేవంత్ తెలిపారు. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తామన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, విభజన చట్టం అంశాలపై ప్రధాని, అమిత్ షాను కలిశాం. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు పనులు కేటాయించాలని కోరాం. తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఏర్పాటు చేయాలి. ఐటిఐఆర్ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి కేటాయింపులు చేయాలి. సెమీ కండక్టర్స్ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరాము. ప్రతి జిల్లాకు నవోదయ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాము. విద్యుత్తు రంగంలో తెలంగాణకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరాం. ఎక్స్చేంజి కింద డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశా’’ అని భట్టి పేర్కొన్నారు.‘‘రీజినల్ రింగ్ రోడ్డుకు మొత్తంగా ఒకే జాతీయ రహదారి నెంబర్ ఇవ్వాలి. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలి. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంలో తెలంగాణ మార్చేందుకు కేంద్రం సహకారం ఇవ్వాలి. ఐపీఎస్ క్యాడర్ కింద 29 మందిని అదనంగా ఇవ్వాలి. భద్రాచలంలోకి ఐదు గ్రామాలు ఇవ్వాలని కోరాం’’ అని భట్టి వెల్లడించారు. -
హైదరాబాద్-విజయవాడ హైవేని సిక్స్ లైన్గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆగస్టు 15వ తేదీలోపే తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదిహేనేళ్లు అధికారంలో ఉంటామనేది పెద్ద జోక్ అంటూ కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి కోమటిరెడ్డి భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ..‘భువనగిరి, ఆలేరు ప్రజలకు ఇన్నాళ్లు తాగడానికి నీరు కూడా లేక మూసీ నీరు తాగుతున్నారు. నాలుగు నెలల్లోనే మూసీ నదిని శుద్ధి చేస్తాం. ఆగష్టు 15వ తేదీలోపే రైతులకు రుణమాఫీ చేస్తాం. హైదరాబాద్-విజయవాడ హైవేని ఆరు లైన్లుగా మారుస్తాం. తెలంగాణలో కేసీఆర్ పదిహేనేళ్లు అధికారంలో ఉంటామనేది ఓ పెద్ద జోక్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఏడు చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను పట్టించుకోవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయినట్టు సమాచారం.బీఆర్ఎస్కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి వరకు ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈనెల ఆరో తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్సీలు, మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. -
సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టాం గిదో లెక్కా..!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన సమాజం భవిష్యత్లో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గెలుపోటములకు అతీ తంగా తెలంగాణ సమాజం ఎల్లవేళలా బీఆర్ఎస్కు అండగా ఉందని, భవిష్యత్లోనూ ఉంటుందని ఆయన ప్రకటించారు. బుధవారం ఎర్రవెల్లిలోని నివాసానికి వచ్చిన మహబూబాబాద్, మేడ్చల్, నల్లగొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఉద్యమ చరిత్ర.. తెలంగాణ కోసం సాగించిన పోరును మరోసారి గుర్తు చేసుకున్నారు. రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని చెప్పారు. తెలంగాణ సాధన కోసం నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకొని నిలబడ్డ పారీ్టకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఏ ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణ మరింతగా పొందుకుంటూ బీఆర్ఎస్ ముందడుగు వేస్తుందన్నారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడ్డ దిక్కుమొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, అటునుంచి పదేళ్ల ప్రగతిపాలన దాకా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు, వారు రాసిందే రాత, గీసిందే గీతగా నడిచేదన్నారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకోవడంతోపాటు తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్యవాదానికి సింబాలిక్గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదురించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయ్యిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణ కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే తిరగబడతారు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో మున్నెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేళ్లపాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ, అన్నితీర్లా అండగా నిలబడ్డ బీఆర్ఎస్ను తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజాఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏళ్ల కాంగ్రెస్ వైఖరి అని..ప్రజలు అనతికాలంలోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని కేసీఆర్ వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్లైట్ పట్టుకొని వెతుక్కుంటూ జనం బీఆర్ఎస్ కోసం వస్తారని కేసీఆర్ అన్నారు. అప్పడిదాక ఓపిక ప్రజాసమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీమంత్రి జగదీశ్రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, నలమోతు భాస్కర్ రావు, రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలనపై విసిగిపోయిన ప్రజలు
దుబ్బాక: కేవలం ఏడు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విసుగు వచ్చి0దని.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలన ఎక్కువ రోజులుండదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బుధవారం జరిగిన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో నిధుల్లేక గ్రామపంచాయతీలు మురికి కూపాలుగా మారాయని విమర్శించారు. అభివృద్ధి శూన్యమని, నేరాల సంఖ్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇ చ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందన్నారు. రైతుబంధు, పెన్షన్ పెంపు, మహిళలకు గృహజ్యోతి, నిరుద్యోగభృతితో పాటు ఒక్క పథకానికి కూడా దిక్కులేదని పేర్కొన్నారు. ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. పార్టీ నుంచి ఎవ రు పోయినా ఏం కాదని స్పష్టం చేశారు. బలమైన పునాది ఉన్న బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుని అధికారంలోకి వస్తుందని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. గిరిజన ఎమ్మెల్యేపై కేసు దుర్మార్గం సాక్షి, హైదరాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినందుకు గిరిజన మహిళా ఎమ్మెల్యేపై కేసు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. -
ఏడు మండలాల కోసం దీక్ష చేయండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఏడు మండలాలు ఏపీకి పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీ, కేసీఆరే కారణమని చెప్పారు. గాందీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావనే లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వబీఆర్ఎస్కు డిప్యూటీ సీఎం భట్టి సూచనన తర్వాత ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని తెలిపారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ త్వరలోనే అమలు చేస్తామని, రైతులు అప్పుల చేయకుండా సహాయం అందిస్తామని తెలిపారు. ఈ నెల 6న ఏపీ, తెలంగాణ రాష్ట్ర సీఎంల సమావేశంలో పదేళ్ల పెండింగ్ సమస్యలను చర్చిస్తారని వివరించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానం నిర్ణ యం తీసుకుంటుందని తెలిపారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడి విషయంలో కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. రైతు భరోసాపై సబ్ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధితులను శిక్షించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సీఎంల భేటీకి ఏర్పాట్ల పరిశీలనసాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎ.రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్ను సందర్శించారు. సమన్వయంతో సమావేశానికి తగు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట రావు పాల్గొన్నారు. -
ఆషాఢం తర్వాతే..! కేబినెట్ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్ పదవుల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: సమీకరణలు కుదరలేదు. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పదవుల భర్తీ ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలికంగా నీళ్లు చల్లింది. ఆయా అంశాలపై మరో వారం, పదిరోజుల తర్వాత తీరిగ్గా చర్చిద్దామంది. అప్పటివరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించింది. వాస్తవానికి జూలై మొదటి వారంలోనే కీలక పదవుల భర్తీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ముమ్మర కసరత్తు జరిగినా చివరకు అన్నీ వాయిదా పడ్డాయి. కేబినెట్ విస్తరణ సహా పదవుల పంపకాలన్నీ ఆషాఢ మాసం పూర్తయ్యాక ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. తాజా భేటీలోనూ తేలని సమీకరణలు రాష్ట్ర కేబినెట్లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై గడిచిన వారం, పది రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది. తాజాగా బుధవారం కూడా ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్రెడ్డి మరోమారు ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, కేసీలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు కొనసాగాయి. మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నవారి పేర్లను మరోమారు పరిశీలించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేంసాగర్రావు, వివేక్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో వాకిటి శ్రీహరి పేరుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా పేర్ల విషయంలో పీఠముడి నెలకొంది. ఇలాగైతే ఏం చేయాలి..? నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్ష రేసులో మహేశ్కుమార్ గౌడ్, గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్లు ఉన్న దృష్ట్యా, ఒకవేళ వీరిలో ఒకరికి ఆ పదవి కట్టబెడితే, అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్రెడ్డిని ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఇదే జిల్లా నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో కలిపి మొత్తం ముగ్గురు రెడ్లు మంత్రులవుతారు. ఒకవేళ ఆ అంశాన్ని పక్కన పెట్టినా, జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్కు మంత్రి పదవి ఇవ్వడం కష్టంగా మారుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలు జి.వివేక్, ప్రేంసాగర్ రావుల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. భట్టి సహా ఇతర నేతలు మద్దతిస్తున్న వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్ను కేబినెట్లోకి తీసుకుంటే ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రుల సంఖ్య పెరుగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి మల్రెడ్డి, రామ్మోహన్రెడ్డి రేసులో ఉండగా, ఇక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా గట్టిగా ఉంది. దీంతో వీరి విషయంలోనూ నిర్ణయానికి రాలేకపోయారు. ఇలా పలు పేర్ల విషయంలో పలు సమీకరణాలు ముడిపడి ఉండటంతో నేతలు ఒక నిశి్చతాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ దృష్ట్యానే కేబినెట్ విస్తరణ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వారం, పదిరోజుల తర్వాత దీనిపై చర్చిద్దామని హైకమాండ్ పెద్దలు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పీసీసీ సైతం వాయిదానే.. బుధవారం నాటి భేటీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించినా, దీన్ని సైతం అధిష్టానం పెద్దలు తేల్చలేకపోయారు. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వరాŠిగ్నకి చెందిన సీనియర్ నేతలు మహేశ్, మధుయాష్కీలలో ఒకరికి కట్టబెట్టాలనే ఆలోచన చేసిప్పటికీ సమీకరణలు కుదరని దృష్ట్యా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కుమార్, సంపత్కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ల పేర్లు కూడా మరోమారు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలు, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇక కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయ్యాకే ఇతర పదవుల భరీŠత్ అంశంపై హైకమాండ్ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ గూటికి కేకే – పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే – కేకే అనుభవం కాంగ్రెస్ను బలోపేతం చేస్తుందని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం కేకేకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లోక్సభా పక్ష నేత రాహుల్గాందీ, రా్ర‹Ù్టర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే రాకను స్వాగతించిన ఖర్గే, రాహుల్.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్లో చేరికతో తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని కేకే వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం కేకే రాకను స్వాగతిస్తూ ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. కేకే అనుభవం పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. -
‘లోక్సభ’ ఓటమితో బీఆర్ఎస్ దిష్టి పోయింది: కేసీఆర్
సాక్షి,గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం బీఆర్ఎస్కు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం(జులై3) ఎర్రవెల్లి ఫాంహౌజ్లో తనను కలిసిన మేడ్చల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.‘బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయింది. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోంది.కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నరు. బీఆర్ఎస్ను మళ్లీ తెలంగాణసమాజాం కోరుకుంటోంది. కేసీఆర్ మీద ద్వేషంతో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ మీద ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది’అని కేసీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన కేశవరావు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు.కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కేశవరావు గతంలో అనేక పదవులు కూడా పొందారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి చేరారు. కేసీఆర్తో కలిసి పని చేసిన ఆయనకు రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది.