బిఎస్ 3 నాణ్యత కలిగిన వాహనాల అమ్మకాలపై ఆంక్షల నేపథ్యంలో పలు వాహనాల కంపెనీలు తమ వాహనాల విక్రయం కోసం భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి.
విజయవాడలోనూ నో స్టాక్ బోర్డులు
Mar 31 2017 3:55 PM | Updated on Sep 2 2018 5:28 PM
విజయవాడ:: బిఎస్ 3 నాణ్యత కలిగిన వాహనాల అమ్మకాలపై ఆంక్షల నేపథ్యంలో పలు వాహనాల కంపెనీలు తమ వాహనాల విక్రయం కోసం భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. విజయవాడలోని ప్రముఖ వాహనాల కంపెనీలు ఒక్కరోజు మాత్రమే రూ.12 వేల నుంచి రూ. 22 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా ఆయా షోరూంల వద్ద బారులు తీరారు. బిఎస్ 3 మోడల్ వాహనాలకు ఫైనాన్స్ ఇచ్చేందుకు ఫైనాన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. అయినప్పటికీ నగదుతో కొనుగోలు చేసేందుకు కస్టమర్స్ పోటెత్తడంతో పలు షోరూంల వద్ద నో స్టాక్ అని బోర్డులు పెట్టాల్సి వచ్చింది.
Advertisement
Advertisement