కన్న కొడుకును ఓ తండ్రి కత్తితో నరికి చంపాడు.
కొడుకు హింస భరించలేక..
Sep 15 2016 12:23 PM | Updated on Jul 30 2018 8:29 PM
తాడిపత్రి రూరల్ : కన్న కొడుకును ఓ తండ్రి కత్తితో నరికి చంపాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలోని గన్నవరిపల్లి కాలనీలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. కాలనీలో నివాసముంటున్న చిన్న భూషణ్కు పెద్దయ్య(34) అనే కుమారుడున్నాడు. పెద్దయ్యకు మతిస్థిమితం సరిగా ఉండదు.
డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులపై దాడి చేసి హింసిస్తుంటాడు. చిన్న భూషణ్ తన కుమారుడి హింస భరించలేక చంపేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున కత్తితో నరికి దారుణంగా చంపాడు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలాన్ని తాడిపత్రి డీఎస్పీ సిదాసందరెడ్డి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement