ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ పట్టుబడింది.
రూ. 4.92 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం
Dec 15 2016 3:43 PM | Updated on Oct 17 2018 4:10 PM
కల్లూరు: ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ పట్టుబడింది. జిల్లాలోని కల్లూరులో గురువారం వామన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కొత్త కరెన్సీని తరలించడాన్ని గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 4.92 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో మొత్తం కొత్త రెండు వేల రూపాయలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement