ప్రియమణి రీ ఎంట్రీ | Priyamani re-entry in Kollywood | Sakshi
Sakshi News home page

ప్రియమణి రీ ఎంట్రీ

Mar 31 2015 2:41 AM | Updated on Sep 18 2019 2:56 PM

ప్రియమణి రీ ఎంట్రీ - Sakshi

ప్రియమణి రీ ఎంట్రీ

నటి ప్రియమణి కోలీవుడ్ రీ ఎంట్రీ ఖరారైంది. ఒక విభిన్న కథలో నటించడానికి ఆమె సిద్ధమవుతున్నారు.

నటి ప్రియమణి కోలీవుడ్ రీ ఎంట్రీ ఖరారైంది. ఒక విభిన్న కథలో నటించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. కన్గలాళ్‌ఖైదుసెయ్ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా కోలీవుడ్‌కు పరిచయం చేసిన నటి ప్రియమణి. ఆ చిత్రం ఆమెను నిరాశ పరచినా తదుపరి నటించిన పరుత్తివీరన్ చిత్రం జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళగిగా పల్లెపడుచు పాత్రలో ప్రియమణి జీవించారనే చెప్పాలి. ఆ తర్వాత అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రియమణి కొన్ని చిత్రాలు చేసినా ఆపై అవకాశాలు దూరమయ్యాయి.
 
 తెలుగు, మలయాళం లాంటి ఇతర భాషలపై దృష్టి సారించారు. తమిళంలో ప్రియమణి నటించిన చివరి చిత్రం రావణన్. ఈ చిత్రం మంచి ఫలితాన్నివ్వలేదు. ఆ చిత్ర హిందీ వెర్షన్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయినా అక్కడా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఆ మధ్య కన్నడ అనువాదంగా తమిళంలో విడుదలైన చారులత చిత్రం మినహా ప్రియమణి నటించిన చిత్రమేదీ తమిళ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలాంటిది చాలాకాలం తర్వాత దర్శకుడు రామ్‌కు జంటగా నటించే అవకాశం దక్కించుకున్నారు.
 
 ఈ చిత్రానికి దర్శకుడు మిష్కిన్ కథ అందించి ప్రతినాయకుడిగా నటించనుండటం విశేషం. ఆయన ఇంతకు ముందు నందలాల, ఒనాయుం ఆటుకుట్టియుం చిత్రాలలో ప్రధాన భూమిక పోషించారు. మిష్కిన్ శిష్యుడు జీ.ఇ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం జూన్ 15న ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో ప్రియమణి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement