పళ్లిపట్టు: పాలారులో చెక్డ్యాంలు నిర్మించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం సోదర భావంతో ఉంటున్న తమిళం, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ అన్నారు. వేలూరు జిల్లా సరిహద్దు ఆంధ్రా ప్రాంతంలోని పాలారులో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రా ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రభుత్వం తీరుతో తమిళనాడులోని వేలూరు, కాంచీపురం జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలతోపాటు వ్యవసాయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదమున్నందున చెక్డ్యాంల నిర్మాణానికి అన్ని పార్టీలు వ్యతిరేకత తెలుపుతున్నాయి.
ఇందులో భాగంగా కాంచీపురం జిల్లాలో సోమవారం చంద్రబాబు ప్రభుత్వం తీరుకు నిరసనగా మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర, తమిళనాడులో ఇరు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో మెలగుతున్నారని, అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇరురాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు.
పాలారు నదిపై ఆధారపడి రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నప్పటికీ ఆంధ్రా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలో చెక్డ్యాంలు నిర్మించి తమిళనాడులోకి నీరు రాకుండా అడ్డుకుంటున్నట్లు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరితో రాష్ట్ర ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే చెక్డ్యాంల నిర్మాణాన్ని నిలిపివేసి, ఇప్పటికే నిర్మించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని తెలిపారు. ఆంధ్రా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
బాబు ప్రభుత్వం చిచ్చు పెడుతోంది
Published Tue, Aug 23 2016 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement