కల్తీకల్లు తాగి 20 మంది అస్వస్థతకు గురైన సంఘటనతో ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
కల్తీకల్లు కలకలం.. ఎక్సైజ్ దాడులు
Dec 16 2016 10:56 AM | Updated on Jul 11 2019 8:43 PM
సిరిసిల్ల: కల్తీకల్లు తాగి 20 మంది అస్వస్థతకు గురైన సంఘటనతో ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కల్తీకల్లు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రంగంలోకి దిగారు. సిరిసిల్ల జిల్లా మద్దమల్లలో గురువారం కల్తీ కల్లు బారిన పడి 20 మంది అస్వస్థతకు గురై ఎల్లారెడ్డిపేట ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. కల్లుపాకలపై దాడులు చేసి నమూనాలు సేకరిస్తున్నారు
Advertisement
Advertisement