అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన ఏఎస్సై మోహన్రెడ్డిపై పలు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడులు నిర్వహిస్తున్నారు.
ఏఎస్సై మోహన్రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
Apr 7 2017 12:35 PM | Updated on Aug 20 2018 5:11 PM
కరీంనగర్: అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన ఏఎస్సై మోహన్రెడ్డిపై పలు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలోని తిరుమలనగర్లో ఉన్న ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రావు నేతృత్వంలోని అధికారులు ఆయన ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement