20 క్వింటాళ్ల పటిక స్వాధీనం | Sakshi
Sakshi News home page

20 క్వింటాళ్ల పటిక స్వాధీనం

Published Mon, Oct 17 2016 2:50 PM

20 Quintals alum caught in narsampet

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట చౌరస్తాలో ఎక్సైజ్ అధికారులు 20 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నారు. ఈ పటికను గుడుంబా తయారీ కోసం వాడతారు. ఎలాంటి అనుమతి లేకుండా రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అధికారుల రాకతో డ్రైవర్ పరారయ్యాడు. పటికను, ఆటోను అధికారులు సీజ్ చేసి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement