భారత్ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక... సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది.
కొలంబో: భారత్ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక... సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. తొలి వన్డేలో శ్రీలంక 25 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 317 పరుగులు చేసింది. దిల్షాన్ (88), జయవర్ధనే (55) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 47.1 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (119), రవి బొపారా (65) రాణించినా తమ జట్టును గట్టెక్కించలేకపోయారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది.