ధరమ్వీర్కు చేయూతనిచ్చిన గ్రామస్థులు
ఒలింపిక్ 200మీ. బరిలో భారత అథ్లెట్
చండీగఢ్: ఆ కుర్రాడిలో నైపుణ్యం ఉంది... కానీ శిక్షణకు డబ్బు లేదు... ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ నెలకు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. కానీ పేద కుటుంబం. తండ్రి రైతు. శిక్షణ కోసం నెలకు రూ.40 వేలు ఖర్చవుతోంది..? ఏం చేయాలి..? నాలుగు నెలల క్రితం భారత అథ్లెట్ ధరమ్వీర్ పరిస్థితి ఇది. సాధారణంగా క్రీడల్లో శిక్షణ కోసం డబ్బులు కావాలంటే చాలా మంది బంధువులు కూడా అప్పు ఇవ్వడానికి వెనకాడతారు. కానీ హరియాణాలోని రోహటక్ జిల్లాలో ఉన్న అజాయిబ్ గ్రామస్థులు మాత్రం ఇంకోలా ఆలోచించారు. తమ ఊరి కుర్రాడిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. తలా ఓ చెయ్యేసి రూ.4.5 లక్షలు జమ చేశారు. ఆ డబ్బు మార్చిలో ధరమ్వీర్కు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుని శిక్షణ కొనసాగించిన ఈ అథ్లెట్ మూడు నెలల్లోనే ఆ గ్రామస్థుల్లో సంబరాన్ని నింపాడు. 200 మీటర్ల విభాగంలో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఆ గ్రామస్థుల ప్రోత్సాహం, ధరమ్వీర్ కష్టంతో... 200 మీటర్ల పరుగుకు 36 ఏళ్ల విరామం తర్వాత భారత్ నుంచి ఓ అథ్లెట్ ఒలింపిక్స్కు వెళుతున్నాడు.
ఒలింపిక్స్ అర్హత మీట్లో ధరమ్వీర్ 200మీ.ను 20.45 సెకన్లలో పూర్తిచేసి రియో ప్రమాణాన్ని (20.50 సె) అందుకున్నాడు. అంతే కాకుండా 2015 ఆసియా చాంపియన్షిప్లో 20.66 సెకన్లతో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును కూడా సవరించాడు. ‘వాస్తవానికి 2012 లండన్ ఒలింపిక్స్కే ధరమ్వీర్ అర్హత సాధించాలి. అయితే ప్రభుత్వ సహాయం లేకపోవడం, శిక్షణకు కావాల్సినంత డబ్బు లేకపోవడం కారణంగా అతను ఏమీ చేయలేకపోయాడు. 2006లో కాలేజీ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా తొలిసారిగా ధరమ్వీర్ ప్రతిభను గుర్తించాను. ఆర్థిక ఇబ్బం దులు లేకపోయుంటే ఈపాటికే అతను మరిన్ని ఘనతలు సాధించేవాడు’ అని పదేళ్లుగా అతనికి కోచ్గా వ్యవహరిస్తున్న డాక్టర్ రమేశ్ సంధూ తెలిపారు.
బోల్ట్ గురించి ఆలోచించను...
రియో ఒలింపిక్స్లో తన వ్యక్తిగత ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తానని ధరమ్వీర్ తెలిపాడు. 200 మీటర్ల విభాగంలో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ అయిన జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ‘రియోలో బోల్ట్ నాకు మరో ప్రత్యర్థి లాంటివాడు. నా ప్రదర్శనపైనే నేను దృష్టి పెట్టాను. 20 సెకన్లలోపు పరుగెత్తడమే నా లక్ష్యం. రియోకు అర్హత సాధించడం నాకేమీ ఆశ్చర్యమనిపించలేదు. ఈ లక్ష్యం కోసం నేను ఎనిమిదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నాను. భారత్లో ప్రతిభకు కొదువలేదు. సరైన సహాయం లభిస్తే మరింతమంది వెలుగులోకి వస్తారు’ అని ధరమ్వీర్ అంటున్నాడు.
తలా ఓ చెయ్యేశారు...
Published Thu, Jul 21 2016 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement