ఐసీసీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
మెల్బోర్న్: క్రికెట్ను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యం తో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)... కొత్తగా మరో రెండు దేశాలు నేపాల్, నెదర్లాండ్స్లకు టి20 హోదా కల్పించింది. తొలి చైర్మన్గా ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఐసీసీకి అనుబంధంగా రూపొందించిన పలు సబ్ కమిటీలకు ఆమోదముద్ర వేసింది. అత్యంత ప్రధానమైన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పాకిస్థాన్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల అధ్యక్షులు నజాం సేథి, డేవిడ్ కామెరూన్లకు చోటు కల్పించింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి వాలీ ఎడ్వర్డ్స్ (ఆస్ట్రేలియా) సారథ్యం వహిస్తారు. శ్రీనివాసన్, గైల్స్ క్లార్క్ (ఇంగ్లండ్)లు ఇతర సభ్యులుగా ఉంటారు.
టెస్టు మ్యాచ్లో గాయంతో మైదానాన్ని వీడిన బౌలర్ తిరిగి మైదానంలోకి వచ్చినా... బయట ఉన్నంత సమయం గానీ, కనీసం 30 ఓవర్లపాటు గానీ ఫీల్డింగ్ చేస్తే మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతిస్తారు.
ఇప్పటిదాకా 80 నిమిషాలుగా ఉన్న టి20 మ్యాచ్ నిర్ణీత సమయాన్ని 85 నిమిషాలకు పెంచారు. అమెరికాలో యూఎస్ఏ క్రికెట్ అసోసియేషన్ (యూఎస్ఏసీఏ)కు అధికారిక గుర్తింపునిచ్చారు. ఒమన్ క్రికెట్ (ఓసీ)ని 38వ అసోసియేట్ సభ్యదేశంగా గుర్తించారు.
నేపాల్, నెదర్లాండ్స్లకు టి20 హోదా
Published Sun, Jun 29 2014 2:05 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement