ఆఖరి వన్డే : ఆ ఇద్దరూ మళ్లీ విఫలం..! | India Vs New Zealand 3rd ODI Team India Lost Two Wickets At 32 Runs | Sakshi
Sakshi News home page

ఆఖరి వన్డే : మయాంక్‌ 1, కోహ్లి మళ్లీ విఫలం..!

Feb 11 2020 8:15 AM | Updated on Feb 11 2020 9:06 AM

India Vs New Zealand 3rd ODI Team India Lost Two Wickets At 32 Runs - Sakshi

ఫైల్‌ ఫోటో

32 పరుగులకే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది.

మౌంట్‌ మాంగనీ: ఇప్పటికే తొలి రెండు వన్డేలను, దాంతోపాటు కివీస్‌కు సిరీస్‌ను సమర్పించుకున్న భారత్‌ మూడో వన్డేలోనూ కష్టాల దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచిన కివీస్‌ కోహ్లి సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా 32 పరుగులకే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 1 పరుగుకే పెవిలియన్‌ చేరగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (12 బంతుల్లో 9 పరుగులు; 1 ఫోర్‌) మరోసారి విఫలమయ్యాడు. 2-0తో సిరీస్‌ గెలుచుక్ను ఆతిథ్య న్యూజిలాండ్‌ టీ20 వైట్‌వాష్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. నామమాత్రమైన మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో 51 పరుగులు చేసి రాణించిన కింగ్‌ కోహ్లి, రెండో వన్డేలో 15 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక మాయాంక్‌ తొలి వన్డేలో 32 పరుగులతో రాణించగా..రెండో వన్డేలో 3 పరుగులు మాత్రమే చేశాడు.
(చదవండి : మ్యాచ్‌తో పాటు సిరీస్‌ కూడా... )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement