ఆయన వల్లే ఇక్కడివరకు వచ్చా​: సింధు | Sakshi
Sakshi News home page

ఆయన వల్లే ఇక్కడివరకు వచ్చా​: సింధు

Published Sat, Aug 20 2016 8:40 AM

ఆయన వల్లే ఇక్కడివరకు వచ్చా​: సింధు

రియో డీ జనీరో: ఒలింపిక్స్ లో తాను సాధించిన వెండి పతకం కోచ్, తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్టు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రకటించింది. తన కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగానే తాను ఇక్కడి వరకు వచ్చానని చెప్పింది. ఫైనల్ మ్యాచ్ ముగిశాక సింధు మీడియాతో మాట్లాడింది.

’చాలా సంతోషంగా ఉంది. అయామ్ ఆన్ క్లౌడ్ టుడే. ఈ వారం నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ వారంలోనే వెండి పతకం సాధించాను. కరోలినా కూడా బాగా ఆడింది. ఫైనల్లో ఇద్దరం హోరాహోరీగా తలపడ్డాం. కానీ ఈరోజు ఆమె పైచేయి సాధించింది. మొత్తంగా చూస్తే చాలా మంచి గేమ్ ఆడాం. నాకు సిల్వర్ మెడల్ దక్కినా సంతోషంగానే ఉంది. నాకు మద్దతు తెలిపి, నా విజయం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు.

నీ రోజు నేనిక్కడ ఉన్నానంటే అందుకు కారణం కోచ్ గోపీచంద్. ఒలింపిక్స్ కోసం నేను చాలా కష్టపడ్డాను. నాతో సమానంగా ఆయన కూడా శ్రమించారు. నా మెడల్ ను కోచ్, నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను. నా మ్యాచ్ లు ఆలస్యంగా జరిగినప్పటికీ ఒపిగ్గా వీక్షించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరి అండదండలే నాకు ఆలంబనగా నిలిచాయ’ని సింధు పేర్కొంది.

Advertisement
Advertisement