CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌కు రజతం

CWG 2022: PV Sindhu Won Indian Badminton Mixed Team Settle Silver Medal - Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతుంది. తాజాగా భారత్‌ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. భారత బ్యాడ్మింటన్‌ మిక్సడ్‌ టీమ్‌ విభాగం రజత పతకం సాధించింది. మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ముందుగా భారత షెట్లర్లు చిరాగ్‌ శెట్టి- సాత్విక్‌ సాయిరాజ్‌ మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా,వూయి యిక్‌తో జరిగిన  పురుషులు డబుల్స్‌ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 21-18,21-15 తేడాతో చిరాగ్‌-సాత్విక్‌ జంట ఓటమి చవిచూసింది. అనంతరం సింగిల్స్‌లో భాగంగా పీవీ సింధు..  మలేషియా స్టార్‌ జిన్‌ వెయ్‌-గోహ్‌ను 22-20, 21-17తో మట్టికరిపించి మ్యాచ్‌ గెలిచింది.

మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత్‌ షెట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. మలేషియా షెట్లర్‌ జె యోంగ్‌ చేతిలో 21-19,6-21,21-16తో ఓడిపోయాడు. దీంతో మలేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిర్ణయాత్మకమైన నాలుగో మ్యాచ్‌ అయిన మహిళల డబుల్స్‌లో భారత్‌ జోడి త్రీసా జోలీ-గాయత్రి గోపిచంద్‌ చేతులెత్తేసింది. మలేషియన్‌ జంట మురళీధరన్ తీనా- కూంగ్ లే పెర్లీ టాన్ చేతిలో 21-18,21-17తో భారత్‌ జంట ఓటమి పాలవ్వడంతో భారత్‌ ఖాతాలో రజతం వచ్చి చేరింది. ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 13 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణం, ఐదు రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి.

చదవండి: Lan Bowls CWG 2022: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’

CWG 2022: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top