బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు | HC issues notice to BCCI on CSK plea | Sakshi
Sakshi News home page

బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు

Aug 21 2015 11:54 PM | Updated on Oct 8 2018 3:56 PM

ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిన వ్యవహారంలో బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

 చెన్నై: ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిన వ్యవహారంలో బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఐపీఎల్ నుంచి చెన్నైని తప్పించడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఇండియా సిమెంట్స్  పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివజ్ఞానంలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో బిహార్ క్రికెట్ సంఘం ఇంప్లీడ్ అయ్యేందుకు కూడా అనుమతించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. లోధా కమిటీ  తీర్పుపై స్టే ఇవ్వాలని ఇండియా సిమెంట్స్ కోరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement