మూడోటెస్టు: నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్ | England 78/1 at lunch in Third test against India | Sakshi
Sakshi News home page

మూడోటెస్టు: నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్

Jul 27 2014 6:13 PM | Updated on Sep 2 2017 10:58 AM

లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఓ వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది.

సౌతాంప్టన్: భారత్తో మూడో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. ఆదివారం ఆరంభమైన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఓ వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది. కుక్ (48 బ్యాటింగ్), బాలెన్స్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్ షమీ.. రాబ్సన్ (26)ను అవుట్ చేశాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు డ్రాగా ముగియగా, రెండో మ్యాచ్లో ధోనీసేన ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

జట్లు:

భారత్: ధోనీ (కెప్టెన్/కీపర్), మురళీ విజయ్, ధవన్, పుజారా, కోహ్లీ, రోహిత్, రహానె, జడేజా, భువనేశ్వర్, షమీ, పంకజ్
ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), రాబ్సన్, బాలెన్స్, బెల్, అలీ, బట్లర్ (కీపర్), వోక్స్, జోర్డాన్, బ్రాడ్, ఆండర్సన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement