ఆలిండియా పెప్సీ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పోటీ పడే డాన్బాస్కో జట్లను బుధవారం ప్రకటించారు. డాన్బాస్కో క్రికెట్ అకాడమీ అండర్-14, 16 జట్లను ఎంపిక చేసింది. అండర్-14 జట్టుకు కిరిటీ, అండర్-16 జట్టుకు రిత్విక్ కుమార్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా పెప్సీ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పోటీ పడే డాన్బాస్కో జట్లను బుధవారం ప్రకటించారు. డాన్బాస్కో క్రికెట్ అకాడమీ అండర్-14, 16 జట్లను ఎంపిక చేసింది. అండర్-14 జట్టుకు కిరిటీ, అండర్-16 జట్టుకు రిత్విక్ కుమార్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ రెండు జట్లు ఈ నెల 23 నుంచి 30 వరకు బెంగళూరులో జరిగే పెప్సీ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటాయి.
అండర్-14 జట్టు: కిరిటీ (కెప్టెన్), రేవంత్ రెడ్డి, సమరసింహారెడ్డి, రాహుల్, ప్రతీక్, అభిషయ్, రూబెన్ రిచర్డ్స్, లిఖిత్, జ్ఞాన్స్వరూప్, వినీత్ చందర్, రుత్విక్, పవన్, గణేశ్ గౌడ్, నిధీశ్, శ్రీహిత్, వికాస్; కోచ్: విజయ్.
అండర్-16 జట్టు: రిత్విక్ కుమార్ (కెప్టెన్), రక్షిత్, ఆకాశ్, మధుసూదన్ రెడ్డి, ఆకాశ్ కుమార్, రోహన్, హార్దిక్ వినయ్, ఎం. సందీప్, ఆదిత్య నిగమ్, నమన్ సురానా, జోసెఫ్, సందీప్, మహేశ్, సాయి నితీశ్రెడ్డి, పవన్ కుమార్, మహ్మద్ ఇసాహ్; కోచ్: క్రిస్టోఫర్ థామస్.