రేపు ప్రజాసంకల్పయాత్ర నిలుపుదల

One day break for Praja Sankalpa Yatra over AP bandh - Sakshi

ఏపీ బంద్‌కు మద్దతుగా రేపు (గురువారం) ప్రజాసంకల్పయాత్ర నిలుపుదల

సాక్షి, అమరావతి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు రేపు (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాల బంద్‌కు వైఎస్‌ఆర్‌ సీపీ తన విధానంలో భాగంగా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బంద్‌కు మద్దతుగా వైఎస్‌ జగన్‌.. రేపు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలంతా ఒకటిగా నిలబడాలని, రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ విజ్ఞప్తి చేసింది.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top