పార్లమెంట్‌లో టీడీపీవి డ్రామాలు : కొరుముట్ల | YSRCP MLA Koramutla Criticised TDP Government | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో టీడీపీవి డ్రామాలు : కొరుముట్ల

Mar 9 2018 7:13 PM | Updated on Mar 23 2019 9:10 PM

YSRCP MLA Koramutla Criticised TDP Government - Sakshi

సాక్షి, కడప : అన్ని వర్గాలకు న్యాయం అనేది అబద్ధమని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే పార్లమెంట్‌లో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు.

ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ..కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల గారడీ చేశారని ఎద్దేవా చేశారు.  ప్రత్యేక హోదాపై ప్రజల్లో సెంటిమెంట్ పెరగడంతో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుందని, అందుకే పార్లమెంట్‌లో డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే టీడీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేశారని, ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ ఎందుకు వైదొలగడంలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement