
సాక్షి, సౌత్మోపూర్: 2008 వరకు నెల్లూరు జిల్లాలో యూనివర్సిటీ లేదని, 2008లో ఇక్కడి పిల్లలు బాగా చదవాలి, బాగా ఎదగాలి అనే ఉద్దేశంతో దివంగత నేత, నాన్నగారు వైఎస్సార్ జిల్లాలో విక్రమసింహపురి యూనివర్సిటీ ఏర్పాటుచేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనకు ఇవాళ విక్రమసింహపురి యూనివర్సిటీ పరిస్థితి అద్దం పడుతోందని, చాలాకాలంగా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. కొద్దో, గొప్పో పోస్టులు తీసుకున్నా.. అవి నిబంధనలకు విరుద్ధంగానే తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద పడ్డారని, దీంతో ఈ రోజు జాబు ఉండాలంటే.. బాబు పోవాలని ఉద్యోగులు అంటున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూర్కు చేరుకున్న వైఎస్ జగన్కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
- నాన్నగారు వైఎస్ఆర్ పాలనలో ఇదే ఊరిలో జూనియర్ కాలేజీ కావాలనే అడిగితే.. వెంటనే మంజూరైంది
- ఇదే జూనియర్ కాలేజీలో ఇవాళ వందలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు
- నెల్లూరు నగరపాలక సంస్థలో 15 వరకు శివారు గ్రామాలు కలిపారు
- కానీ, ఆ గ్రామాల్లో డ్రైనేజీలు, రోడ్లు వేయడంతోపాటు, తాగునీరు ఇవ్వాలన్న కనీస ఆలోచన కూడా లేదు
- నగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు కోసం ఉడ్కో (యూడీసీవో) నుంచి తెచ్చిన రూ. 1100 కోట్ల రుణాలు ఏమయ్యాయి.
- రూ. 1100 కోట్లు అప్పుగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు ఎందుకు చేయలేదు
- అప్పుగా తేవడం వల్ల భవిష్యత్తులో ఇక్కడ ఇంటి పన్నులు, కరెంటు చార్జులు, మోతమోగుతాయి
- నెల్లూరు బ్యారేజ్ ఆధునీకరణ పనులు దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో 80శాతం పనులు పూర్తయ్యాయి
- మిగతా 20శాతం పనులను కూడా చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో పూర్తి చేయలేదు
- ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా పనులు సాగుతున్నాయి
- ఇక్కడ పక్కనే ఆటోనగర్లో తాగడానికి నీళ్లు లేవు, రోడ్డు లేదు
- పేదవారి సొమ్ము కొట్టేయాలన్న దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుది
- అందుకే 300 అడుగుల ఫ్లాట్లు ఇవ్వడానికి పేదల నుంచి రూ. 3 లక్షలు వసూలు చేస్తామని అంటున్నాడు
- ఫ్లాట్ల నిర్మాణానికి ఆరు లక్షలు అవుతుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు లక్షలు ఇస్తాయట..
- మిగిలిన మూడు లక్షలు పేదవాడికి అప్పు ఇచ్చినట్టు చూపిస్తారట
- పేదవాడు ప్రతి నెల మూడువేల చొప్పున 20 సంవత్సరాలు ఆ అప్పును కట్టాలట
- ఇంత అన్యాయమైన పాలన ఎక్కడా లేదు
ఇంతకంటే దారుణమైన మోసం ఇంకోటి ఉంటుందా?
- మన రాష్ట్రంలో కంటే తమిళనాడులో లీటరు పెట్రోల్ ఏడు రూపాయలు తక్కువకు దొరుకుతుంది
- కర్ణాటకలోనూ మనకంటే ఆరు రూపాయల వరకు తక్కువ ధర ఉంది.
- కానీ దేశంలో ఎక్కడలేని, షాక్ కొట్టేరేట్లు పెట్రోల్కు మన రాష్ట్రంలో ఉన్నాయి
- బైకు ఎక్కాలంటే.. ప్రతి లీటరుకు రూ. 7 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది
- ఎన్నికల సమయంలో ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు
- పిల్లలు మద్యం తాగి చెడిపోతున్నారు అన్నాడు
- మద్యం అమ్మకాలు నియంత్రిస్తామని, బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని చెప్పాడు
- ఇప్పుడు ఆయన హైటెక్ పాలన ఏ స్థాయిలో ఉందంటే.. ప్రతి ఊరిలో మద్యం షాపు ఉంది
- ఫోన్ కొడితే నేరుగా ఇంటికే మద్యం తీసుకువస్తున్నారు
- ప్రతి ఊరిలో నీళ్లు దొరుకుతున్నాయో లేదో తెలీదు కానీ మద్యం మాత్రం దొరుకుతోంది
- ఫోన్ కొడితే నీళ్లు రావడం లేదు కానీ మద్యం వస్తోంది
- ఎన్నికల సమయంలో ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు
- కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి.. విపరీతంగా పెరిగాయి చెప్పాడు
- వస్తూనే కరెంటు బిల్లులు తగ్గిస్తానని బాబు ఆనాడు అన్నాడు
- బాబు ముఖ్యమంత్రి కాకముందు.. కరెంటు బిల్లులు రూ. 40, 50, 70 వచ్చేవి
- కానీ ఇవాళ మీ కరెంటు బిల్లు ఎంత వస్తోంది
- రూ. 500, 600, 700 వెయ్యి రూపాయలు వస్తున్నాయి
- కరెంటు బిల్లులు చూస్తే షాక్ కొడుతున్నాయి
- బాబు పాలన మొదలుకాగానే మూడుసార్లు కరెంటు చార్జీలు పెంచారు
- ఇదే పెద్దమనిషి పాలన రాకముందు రేషన్ షాపుకు వెళితే..
బియ్యంతోపాటు చక్కర, పామాయిల్, కిరోసిన్, చింతపండు, కందిపప్పు, గోధుమలు, కారం, పసుపు దొరికేవి - కానీ ఇప్పుడు చంద్రబాబు పాలనలో రేషన్ షాపులో బియ్యం తప్ప ఏమీ దొరకడం లేదు.
- ఆ బియ్యం కూడా వేలిముద్రలు పడటం లేదని కుటుంబంలో ఇద్దరికి, ముగ్గురికి కట్ చేస్తున్నారు
- ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీస చార్జీలు మోత మోగుతున్నాయి
- బాబు సీఎం అయ్యాక మూడుసార్లు పెరిగాయి
- బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నాడు
- 86 వేల కోట్ల రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు
- బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా? రాలేదు
- కానీ, బ్యాంకులు పంపిస్తున్న బంగారం వేలం నోటీసులు మీ ఇంటికి వస్తున్నాయి
- చంద్రబాబు చేసిన రుణమాఫీ కార్యక్రమం కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదు
- ఇంతకంటే దారుణమైన మోసం ఇంకోటి ఉంటుందా?
- జాబు రావాలంటే బాబు రావాలన్నాడు
- జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు
- నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రతి ఇంటికి 45నెలలుగా రూ. 90 వేలు బాకీ ఉన్నాడు
- చంద్రబాబు కనిపిస్తే.. మా బాకీ డబ్బులు ఏవని గట్టిగా అడగండి
- ఎవరైనా ఆడవాళ్లను మోసం చేయాలంటే భయపడతారు
- కానీ చంద్రబాబు మహిళల డ్వాక్రారుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి వారినీ మోసం చేశారు
- మహిళల డ్వాక్రా రుణాలు కనీసం ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు
- దీనికితోడు డ్వాక్రా మహిళలకు బ్యాంకులు ఇచ్చే వడ్డీ లేని రుణాలను కూడా చంద్రబాబు రాకుండా చేశాడు